SHARE

Sunday, June 17, 2012

దేవుడు నరసింహ శాస్త్రి గారి శిష్యులు


                                                                     నమో నమః


     పై ఫోటో లో ఉన్నది శ్రీ గోవిందరాజన్   అయ్యర్ గారు , వారి సతీమణి.       శ్రీ గోవిందరాజన్ గారు కిందటి సంవత్సరమే నూరవ పుట్టిన రోజు జరుపుకున్నారు . వారి సతీ మణికి ఇప్పుడు తొంభై సంవత్సరాలు.


     ' మంత్ర ద్రష్ట ' పుస్తకపు మూలమైన కన్నడ  భాషలోని   ' మహా బ్రాహ్మణ ' పుస్తకము రాసిన శ్రీ దేవుడు నరసింహశాస్త్రి గారు , శ్రీ గోవింద రాజన్ గారికి గురువు గారు .  1925-1935  మధ్య  వీరు , వారిదగ్గర శిష్యుడు గా ఉన్నారు .
    
      శ్రీ గోవిందరాజన్ గారు కూడా ఉపాధ్యయులే .  వీరిని గురించి తెలియని వారు ఒకప్పుడు  బెంగుళూరిలోనే కాక , కర్నాటకలో కూడా ఎవరూ ఉండేవారు కాదు .


      వీరిద్దరూ ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా , తమ పనులు తామే చేసుకుంటూ ఆది దంపతుల వలె నిండుగా ఉంటారు. శ్రీ గోవింద రాజన్ గారు ఇప్పటికీ రుద్రము , అరుణము మహా న్యాసము వంటివి కుమారునితో పాటూ పారాయణ చేస్తారు . రోజూ పొద్దున్నే నిత్య కర్మల తర్వాత కొడుకు ఇచ్చే అభిషేకపు తీర్థము తీసుకుని గానీ వీరి దిన చర్య (  వార్తా పత్రికా పఠనము , టీ వీ వీక్షణము , మొ ॥ )  మొదలు కాదు .


     ఈమధ్య  వీరితో  మాట్లాడాను . మా వూరి తో ( అనంతపురము ) వారికున్న అనుబంధము గురించి చెప్పారు .


      ఇంకా చెప్పుటకు చాలా ఉందికాని , గ్రంధ విస్తరణ భీతి చే ఇక్కడికి నిలుపుతాను .


     శ్రీ దేవుడు గారు చాలా నిరాడంబర వ్యక్తి  అని , అతి నిష్ఠా గరిష్ఠులనీ శ్రీ గోవిందరాజన్ గారు చెపుతారు . వీరు తెలుగు , కన్నడ , తమిళ్ , ఇంగ్లీషు భాషలు అనర్గళముగా మాట్లాడతారు . వారి సతీమణి కేరళ నుండీ వచ్చిన   అయ్యరు కుటుంబీకులు .


     వీరి ఆఖరి పుత్రుడు  శ్రీ అశోక్ అయ్యర్ గారు నాకు మంచి మిత్రులే కాక, వేదాధ్యయనములో నాకు సహపాఠి.  మా ఇద్దరి అధ్యయనము ఇంకా సాగుతున్నది . మా గురువు గారు పూజ్య శ్రీ ప్రకాశ భట్టు గారు . నాకు ' మహా బ్రాహ్మణ '  పుస్తకము దొరికినది వీరి వల్లనే . 

No comments:

Post a Comment