SHARE

Tuesday, December 4, 2012

శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి గారి " ’మహాదర్శనము ’ ' -- త్వరలో


         ’మహాదర్శనము ’ శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి గారు 








         ’మహాదర్శనము ’ శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి గారు రాసిన అనేక కృతులలో ప్రముఖమైన మూడింటిలో ఒకటి ,   చివరిది . ఇది యాజ్ఞవల్క్యుని కథ. 

     పేరుకి యాజ్ఞవల్క్యుని కథ యథాతథముగా రాసినా , ఇందులో అనేక తత్త్వ రహస్యములు , అంతరంగ రహస్యములు , ధ్యాన రహస్యములు మనిషి ఎంతవరకూ అభివృద్ధి చెందవచ్చునో కళ్ళకు కట్టినట్టు , తేలికైన భాషలో , సులభముగా అర్థమయ్యే రీతిలో వ్రాసినారు .     మనలో , మన శరీరములో మనకు తెలియని ఇన్ని రహస్యములున్నవా అని అబ్బుర పరచే కావ్యము. 

     ఆధ్యాత్మికము , తత్త్వము అనగానే చాలామందికి ఒక విముఖత. నిజానికా విముఖత ఆధ్యాత్మికము పైనో , తత్త్వము పైనో కాదు. అది వ్రాసిన విధానము , వ్రాయుటకు వాడిన భాషలపైన మాత్రమే ఆ విముఖత . సరైన విధానములో సరైన భాష వాడి రాస్తే విషయమేదైనా పాఠకులను పట్టి ఉంచుతుంది అనునది ఈ పుస్తకము చక్కగా నిరూపిస్తుంది . 

        ఈ మహా దర్శనము పుస్తకము రాయుటకు ముందు దీనిని ఒక నాటక రూపముగా రాసియుండినారు . అది 1952  లో ఆకాశవాణిలో ప్రసారమయినది . ఆ  నాటకము ఒక పత్రికలో కూడా ప్రచురించబడినది . ఆ తరువాత దీనినే విస్తరించి కాదంబరి ( నవల ) రూపములో వ్రాసినారు. అది కూడా ఇంకొక పత్రికలో ధారావాహికగా అచ్చయినది . 1935 ప్రాంతములో దేవుడు గారు అప్పట్లో ’ మీమాంస కంఠీరవ ’ బిరుదు తెచ్చుకున్న  " శ్రీ వైద్యనాథ శాస్త్రి "  గారి దగ్గర సంప్రదాయ బద్ధముగా ’ మీమాంసా శాస్త్రమును నేర్చుకున్నారు . ఆ సమయములో వారి మిత్రులొకరు యాజ్ఞవల్క్యుని విమర్శించినారట.  అప్పుడు దేవుడు ఆ మిత్రుడితో  " ఒక వేదము , ఒక బ్రాహ్మణము , ఒక ఉపనిషత్తు మానవ లోకానికి తెచ్చి ఇచ్చి, ఇంకొక ఉపనిషత్తుకు కారణమైన యాజ్ఞవల్క్యుడు మహాపురుషుడు . అతడిని ఇలాగ విమర్శించుట తగదు ’ అని చెప్పినారు . ఈ పుస్తకము వారు వ్రాయుటకు ప్రేరణ అదే . 

          శ్రీ దేవుడు నరసింహశాస్త్రి గారు రాసిన ’ మహా బ్రాహ్మణ ’ పుస్తకమును ’ మంత్ర ద్రష్ట ’ పేరుతో నేను చేసిన అనువాదము మీరంతా చదివియున్నారు . వారి కథా కథనము , శైలి , పాఠకుని కట్టి పడవేయు నటువంటి సన్నివేశ చిత్రణ మీకు పరిచితములే . ఈ పుస్తకము కూడా వారి ప్రతిభకు మరొక తార్కాణము. ఇటువంటి పుస్తకములు వ్రాయవలెనంటే కొన్ని సిద్ధులు కలిగి ఉండవలెను . సిద్ధులు ఉంటే చాలదు వాటిని తేలికగా విడమరచి చెప్ప గలగాలి , దానికి ప్రతిభ, నేర్పు ఉండాలి . ఇవన్నీ ఉన్నా స్వానుభవము లేకపోతే కేవలము మేధను ఉపయోగించి వ్రాయుట అసాధ్యము . 

         ఒకసారి చదువుట మొదలు పెట్టుట వరకే మన వంతు . తరువాత అది పూర్తియగు వరకూ నిలపకుండా చదివించే చాకచక్యము దేవుడు గారిది . ’ మహా బ్రాహ్మణ ’ ను అనువదించునపుడు నేను కొంత కష్ట పడినది నిజమే , కానీ ఈ ’ మహా దర్శనము ’ అనువదించుటకు నాకున్న సర్వ శక్తులూ , ప్రతిభలే కాక ,  దేవుడి గారి ఆశీర్వాదము , ఆ భగవంతుడి అనుగ్రహము లేక పూర్తి చేయుట దుస్సాధ్యము అని నాకు మొదట్లోనే అర్థమయినది . ఆయన శైలిలోని ఒక విశేషమేమంటే , ప్రతి పాత్రలోనూ తాను దూరి , కథ చెబుతున్నామన్న ధ్యాసతో కాక , ఆ నిమిషానికి ఆ పాత్ర ఏమాలోచించునో / అనుభవించునో అంత మాత్రమే , ఆ పాత్ర పరముగా వ్రాసి , సంభాషణలు కూడా తదనుగుణము గానే వ్రాయుట. పాఠకులకు సరిగ్గా అర్థము కావలెను కాబట్టి కావలసిన వివరాలన్నీ అప్పుడే చెప్పవలెను అన్న ఆత్రము ఏమాత్రమూ లేకుండా , కథతో పాటే పాఠకుడు కూడా నడుస్తూ , ఒక్కొక్కటీ ఆకళింపు చేసుకుంటూ , ముందుకూ వెనక్కూ పేజీలు తిప్పి తిప్పి సరి చూసుకుంటూ సరిగా అర్థము చేసుకుంటూ వెళ్ళేలా చేస్తాడు . దీనిలో ఏమాత్రమూ విసుగుదల కాదు కదా అసౌకర్యము కూడా లేక, మరింత ఆసక్తిగా చదివించేలా చేయడమే ఆయన ప్రత్యేకత. ఒకభాగములో చదివినది సరిగా అర్థము కాకున్నా , తరువాతి భాగములలో అది పూర్తిగా విశదమై మనల్ని ఆశ్చర్య చకితులను చేస్తుంది . అదీ ఆయన శైలి . 

         ఇందులోని కొన్ని నిగూఢ రహస్యములను , తత్త్వ బోధలను , సరిగా , తప్పులు లేకుండా , తప్పు అర్థము రాకుండా వ్రాయుట నాకు కత్తిమీద సామే అయినది . వారిని ప్రార్థించి , నేను ఎంతో కొంత కృతకృత్యుడనై ఉంటే దాని పూర్తి ఫలమూ , ఖ్యాతీ , శ్రీ దేవుడు గారికే నిస్సందేహముగా చెందుతుంది . 

అనువాదము ఇంకా నడుస్తున్నది . సంక్రాంతి నుంచీ ఇవ్వగలనని అనుకుంటున్నాను . 

శుభం భూయాత్

Tuesday, November 13, 2012

కార్తీకమాస ఆదిత్య ఉపాసన





                              ||  విష్ణురశ్వతరో రంభా  సూర్యవర్చాశ్చ సత్యజిత్ |
                                 విశ్వామిత్రో మఖాపేత ఊర్జమాసం నయంత్యమీ ||

                                 భానుమండల మధ్యస్థం వేదత్రయ నిషేవితం |
                                  గాయత్రీ ప్రతిపాద్యం తం విష్ణుం భక్త్యా నమామ్యహం ||

                ధ్యేయస్సదా సవితృ మండల మధ్యవర్తి నారాయణస్సరసిజాసన సన్నివిష్టః |
                కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హరీ హిరణ్మయ వపుః ధృతశంఖ చక్రః ||

          కార్తీకమాసమందు ’ విష్ణువు ’ అను పేరుతో సూర్యుడు తన రథముపై సంచరించుచుండును . ’ విశ్వామిత్ర ’ మహర్షి , ’ రంభ ’ అను అప్సరస , ’ సూర్యవర్చసుడు ’ అను గంధర్వుడు , ’ సత్యజిత్తు అను యక్షుడు , ’ అశ్వతరము ’ అను సర్పము , ’ మఖాపేత ’ అను రాక్షసుడు ఆయన వెంట ఉందురు .

          ఆయన సూర్యమండలమునకు మధ్య స్థితుడైయుండును . మూడు వేదములు ఆయనను స్తుతించును . గాయత్రీ మంత్రము ద్వారా ప్రతిపాద్యుడైన ఆవిష్ణువునకు నేను భక్తితో నమస్కరించుచున్నాను . విష్ణ్వాదిత్యుడు ఆరు వేల కిరణములతో శోభిల్లుచుండును . అతడు అరుణ వర్ణమును కలిగియుండును .

యమాదిత్యుని మాహాత్మ్యము 


      ఒకసారి యమధర్మరాజు తన లోకమున ఆశీనుడై ,  పాశములను , దండములను ధరించిన తన దూతలను ఇట్లు ఆదేశించెను .

       " విష్ణు స్వరూపుడైన సూర్య భగవానుని యొక్క భక్తుల సమీపమునకు మీరు వెళ్లవలదు , ఏలనన, వారిని ఈ లోకమునకు తీసుకొని వచ్చుట తగదు .  నిరంతరమూ తమ హృదయములను సూర్యుని యందే లగ్నమొనర్చిన ఆయన భక్తులకును , సూర్యభగవానుని పూజించెడి వారికినీ మీరు దూరమునుండియే ప్రణమిల్లి రాగలరు . సర్వకాల సర్వావస్థల యందును సూర్యుని నామములను కీర్తించెడివారు యమలోకమునకు రానక్కరలేదు . భాస్కరుని కొరకు నిత్య నైమిత్తికము లైన యజ్ఞములను ఆచరించు వారి వైపు మీరు కన్నెత్తి యైనను చూడరాదు . మీరు సూర్య భక్తులను తాకిననూ , లేక వారిని యమలోకమునకు తీసుకొని వచ్చుటకు ప్రయత్నించినను మీకు పుట్టగతులుండవు . పుష్పములతో , ధూపదీపములతో , అందమైన వస్త్రములతో సూర్యుని సేవించువారిని మీరు బంధింపరాదు . ఎందుకనగా వారు మా తండ్రికి మిత్రులు . ఆశ్రితులకు ఆశ్రయమైనవారు .  సూర్యమందిరమును శుభ్రపరచెడు వారు , లేదా సూర్యమందిరమును నిర్మించువారు అయిన వారియొక్క మూడు తరములవారిని మీరు బంధింపరాదు . తండ్రియైన సూర్యభగవానుని అర్చించు భక్తుల వంశములవారికి కూడా మీరు సర్వదా దూరముగా ఉండవలెను :"

      మహాత్ముడైన యమధర్మరాజు ఇట్లు ఆదేశించినను ఒకసారి యమభటులు ప్రమత్తులై , ఆ ఆదేశమును జవదాటి , సూర్యభక్తుడైన సత్రాజిత్తు కడకు వెళ్ళిరి . కానీ సత్రాజిత్తు తేజస్సునకు ఆ యమభటులు మూర్ఛితులై భూమిపై పడిపోయిరి . వారి యపరాధమును మన్నింపజేయుటకు యముడు కాశీ యందు యమాదిత్యుని ప్రతిష్టించి , తీవ్రముగా తపస్సు చేసెను . తత్ఫలితముగా సూర్య భగవానుడు ప్రత్యక్షమై ఆయనకు పెక్కు వరములిచ్చెను .

       ఈ యమాదిత్యుడు కాశీ యందు , యమేశ్వరునకు పశ్చిమ దిశయందును , ఆత్మవీరేశ్వరునకు తూర్పు దిశయందునూ , సంకట ఘట్టమున ప్రతిష్ఠితుడై యున్నాడు . యమాదిత్యుని దర్శించేవారికి యమలోకము దర్శించు సందర్భము రాదు . మంగళవారముతో కూడిన చతుర్దశియందు స్నానము చేసి యమేశ్వరుని , యమాదిత్యుని దర్శించెడివారు సకల పాపములనుండీ ముక్తులగుదురు . యమధర్మరాజు ప్రతిష్ఠించిన యమేశ్వరునకూ , యమాదిత్యునకూ ప్రణతులను అర్పించెడివారు యమలోక యాతనలను అనుభవింపవలసిన పనిలేదు సరికదా , వారికి యమలోకమును చూడవలసినపని కూడా లేదు . అంతేగాక , యమ తీర్థమున శ్రాద్ధమొనర్చి , యమాదిత్యుని పూజించువారు పితృ ఋణమునుండీ ముక్తులయ్యెదరు .

      కాశీ యందు పండ్రెండు మంది ఆదిత్యులు ప్రతిష్టితులై యున్నారు . ఈ ద్వాదశాదిత్యుల ఆవిర్భావ కథలను వినినవారికీ , వినిపించినవారికీ, దుర్గతులు దూరమై సద్గతులు లభించును .

( పద్మ పురాణము )

లోకాస్సమస్తాస్సుఖినస్సంతు

Monday, November 12, 2012

వివాహము లో అరుంధతీ నక్షత్ర దర్శనము


వివాహము లో అరుంధతీ నక్షత్ర దర్శనము

          వివాహములోని అనేకమైన తంతులలో , అనగా , అంకురార్పణము అయిన తర్వాత , పెళ్ళికుమారుని , పెళ్ళికూతురును చేయుట ,గౌరీ పూజ , వరపూజ , అటుతర్వాత మధుపర్కము , జీలకర్రా బెల్లము , తలంబ్రాలు  మొదలు ఆచరించు అనేక కార్యముల తో పాటు విశిష్టమైనది అరుంధతీ నక్షత్ర దర్శనము. వివాహ సమయములో వరుడు తన క్షేమాభివృద్ధుల కోసము అనేక మంది దేవతలను ప్రార్థించును . దానికొరకు పెళ్ళికుమారుని చేత పురోహితుడు అనేక మంత్రములను చెప్పించును . 

          మొదట పెళ్ళికుమారుడు వధువుతో , " ఓ కన్యా , నా గృహమునకు వచ్చి నాతో కాపురము చేయుచూ సంతాన సమృద్ధిగలదానివి కమ్ము , నా గృహమునకు వచ్చి , గృహస్థుని ధర్మములగు అతిథి అభ్యాగతులను పూజించుట , ఆదరించుట చేయుటలో నాకు సహకరించుము , పుత్రులు , మనవలు కలిగినాక వారికి కూడా ఇవియన్నియూ బోధించుము " అని చెప్పును (  ఇహ ప్రియం ప్రజయా తే సమృధ్యతా ......వివిధ మావదాసి ||  అనే మంత్రము )

          ఆ తరువాత , || సుమంగలీరియమ్ వధూరిమాగ్ం .........విపరేతన   || అనే మంత్రము చెప్పును . దాని అర్థము  , వివాహమునకు వచ్చిన వారితో , " బహుకాలము వరకూ సువాసినీత్వము కలిగియుండెడి  ఈ వధువు చూచి , ఆమెకు ఆయుర్భాగ్యములనొసగి , ఆశీర్వదించి తరువాత మీ ఇండ్లకు స్వేఛ్చగా వెళ్ళుడు " అని ప్రార్థిస్తాడు .

     తరువాత ధృవ నక్షత్రమును గూర్చి , ’ తనకు జీవితమున శత్రు బాధలు లేకుండా కాపాడుమని ’ ప్రార్థించును . 

         అటుతరువాత , భార్యతో సహా  ఆకాశములోని సప్తర్షి మండలములో నున్న అరుంధతీ నక్షత్రమును దర్శించి , ఈ విధముగా ప్రార్థించును "  కశ్యపుడు మొదలగు ఏడుగురు ఋషులు తమ తమ భార్యలు ఏడుగురిలోను , వశిష్ఠుని భార్య యైన అరుంధతీ దేవి అగ్రగణ్యురాలనీ , అతి పవిత్రమైన పతివ్రత యని , మనస్సునందైననూ , ఒక్క క్షణమైననూ పతిని మరువక సదా తలచుచుండుననీ , అతి నిశ్చలమైనదనీ తలచి ఒప్పుకొనిరి . అందువలన , అరుంధతిగాక మిగిలిన ఆరుగురు స్త్రీలు అరుంధతిని తమలో అగ్రగణ్యురాలు అను భావమును వహించిరి .  అట్టి పరమ సాధ్వియైన అరుంధతీ దర్శనముచేత పవిత్ర భావములు పెంపొంది , నా భార్యను మీ ఏడుగురితో పాటు ఎనిమిదవ దానినిగా ను , పవిత్రమైనదానిగాను తలచి ఆశీర్వదించండి . " . అనగా తాను ఎనిమిదవ ఋషిని యని భావించునట్లు అర్థము . ( || సప్త ఋషయః ప్రథమం కృత్తికానామరుంధతీం ......అస్మాకమేధత్వష్టమీ ||  అనే మంత్రము ) 

తర్వాత అగ్నిహోత్రుని , గంధర్వులను , సూర్యుడిని , ఇతర దేవతలనూ ప్రార్థించును . 

         ఒక సంసారము బాగుగా నడవవలెనంటే దానిలో ఆ ఇంటి గృహిణి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది . అందుకే ఇంటిని చూచి ఇల్లాలిని చూడు అన్నారు . ఒక ఇల్లు నిలవాలన్నా , కూలిపోవాలన్నా అది ఆ ఇంటి ఇల్లాలి వల్లనే అవుతుంది . కాబట్టి తన ఇల్లాలికి అరుంధతిని చూపించి సద్బుద్ధి కలిగించునట్లు చేయమని ప్రార్థించుట. 

        సముద్రము పక్కన కూర్చొనగానే , మనము వద్దనుకొన్ననూ చల్లగాలి వచ్చి ఎటుల తాకునో , అట్లు , అరుంధతిని చూడగనే ఆమె ప్రభావము వలన మనసు పవిత్రమగును అని ప్రతీతి . 

Monday, November 5, 2012

4. " జీవిత చుక్కాని " నాలుగవ అంకం సంబరం


నాలుగవ అంకం  సంబరం



         ఈ అంకం లో మా చిన్నప్పటి పండుగల ఆనందము , ఆకాలపు అలవాట్లు ,  పిల్లలు ఎంతో మురిసేలా అమ్మ చేసే పిండి వంటలు , మా మనోల్లాసము వంటివి మధుర జ్ఞాపకాలు మెదలుతున్నాయి. 


                        అనంతపురం సాయినగరు లో మా పాత ఇంటి పండగ వాతావరణం. 


                           ఇక పండుగలు వస్తే, నిజంగా మాకు పండుగే ! అలాగని, మేమేదో ధూం ధాం గా చేసుకొనే వాళ్ళమని కాదు. ఆడంబరాలు లేకున్నా, పండుగలలోని నిజమైన ఆనందాన్ని , ఆ స్పూర్తినీ, ఎంతో హృద్యమైన అనుభూతులను పొందేవాళ్ళం.  బడాయిలు లేని ఆనాటి సంబరాలు ఎంత మనసుకు హత్తుకునేలా ఉండేవో ! 

                సంక్రాంతికి ఇంటిముందర ౪౦-౫౦ గజాల స్థలంలో  అమ్మ పూర్తిగా ఆవు పేడ తో కళ్ళాపి చల్లించేది. పెద్ద పెద్ద ముగ్గులు వేసేది. మా అక్కయ్యలు కూడా పోటీలు పడి ముగ్గులు వేసేవాళ్ళు. మేము వెళ్ళి గుమ్మడి పూలు, సుంకేసుల పూలు తెచ్చేవాళ్ళం. పేడతో గొబ్బెమ్మలు  చేసి ముగ్గుల మధ్యలో వుంచి, పూలతో అలంకరించి, పసుపు కుంకుమా పెట్టి  హారతి ఇచ్చేది. ఉదయాన్నే ఇంటిముందుకి హరిదాసు వచ్చేవాడు. తలపైన బొట్లు పెట్టిన గిన్నెలో  బియ్యం పోయించుకునేవాడు. గంగిరెద్దులు అలంకరణతో కొమ్ములు  ఊపుతుంటే, వాటిని తోలుకొని వచ్చిన వాళ్ళు ఎద్దుకీ, తమకీ కూడా పళ్ళు, డబ్బులు , ధాన్యము తీసుకొని వెళ్ళే వాళ్ళు. కోస్తా ఆంధ్రా లో ఉన్నంత కాక పోయినా, కోడి పందేలు జరిగేవి.  ఒక అతను హార్మోనియమ్ తెచ్చి, వాయిస్తూ, " పరమాత్మూనీ భజనా,,  పలీకీనంతటానా " అంటూ భిక్షానికొచ్చేవాడు. మిగతా రోజుల్లో కూడా వచ్చేవాడు కాబట్టి, ఆ పాట వినీ వినీ నేర్చేసుకున్నాము.  ఇంకొకాయనైతే, గోచీ పెట్టి పంచె కట్టి, ప్రతి ఇంటిముందుకూ వచ్చి, తలకిందుగా నిలుచొని, " హరి, హరి, హరి, " అంటూ ఉండేవాడు. అలా తలకిందులుగా ఉన్నప్పుడు,  ఆయన పక్కన పెట్టుకున్న బుట్ట లోని బియ్యాన్ని కోళ్ళు వచ్చి తింటుండేవి. ఒకో ఇంటి ముందూ సుమారు అరగంట అలా తలకిందుగా ఉండేవాడు. ఆయనకి వచ్చిన భిక్షమంతా కోళ్ళ పాలయ్యేది. 

           అమ్మ సంక్రాంతి రోజు భోజనంలోకి సద్ద రొట్టెలు, గుమ్మడికాయ కూరా తప్పనిసరిగా చేసేది. మేమంతా ఉదయాన్నే తలంటు స్నానం చేసి మా అమ్మతో పాటు దేవుడికి పూజ చేసి రొట్టెలకోసం కాచుకుని వుండేవాళ్లం. ఒకే పంక్తి లో కూచొని మా నాన్నతో కలిసి మేమంతా భోంచేస్తే, తాను మాత్రం మా భోజనాలు అయ్యాక చివర్న తినేది.

              సాయంత్రం కాగానే, కొత్త బట్టలు తొడుక్కుని, భోగి పళ్ళు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేవాళ్ళం. ఒక జంఖానా పొడుగ్గా పరచి, వరుసగా మమ్మల్ని కూచోపెట్టేది. అందరికీ హారతి ఇచ్చి, ఒక గిన్నెలో లేదా బుట్టలో రేగు పళ్ళు, చెరకు ముక్కలు, బెల్లం ముక్కలు,చిల్లర నాణేలు కలిపి, మా అందరికీ తలలపైన పోసేది. మేమైతే డబ్బులకోసం పోటీపడేవాళ్లం .అలా పిల్లలకు భోగి పళ్ళు పోస్తే వాళ్ళు ఏ దిష్టీ తగులకుండా ఆరోగ్యంగా ఉంటారని  అమ్మ నమ్మకం.

                        ఇక ఉగాది వస్తే, తెల్లవారే  లేచి తలంటి పోసుకుని, ఇంటి చెట్లోంచీ వేప పూత, చిగురుటాకులు తెచ్చి ఉగాది పచ్చడికి సిద్ధం చేసేవాళ్ళం.  ఆరోజు పంచాంగం చదివి, పూజయాక, హోళిగలతో ( బొబ్బట్లు ) కడుపునిండా భోజనం చేసి ఆటలకు వెళ్ళేవాళ్ళం. మా అమ్మ ఏ మధ్యాన్నమో భోంచేసి, కాస్త నడుం వాల్చగానే పని మనుషులు, చాకలి వాళ్ళూ వచ్చేవాళ్ళు. వాళ్ళకి భోజనాలు పెట్టి, ఇండ్లకు ప్రత్యేకంగా అన్ని పదార్థాలు వేసి ఇచ్చేది. ఎంత వంట చేసేదో కానీ, వాళ్ళు తెచ్చుకున్న గిన్నెలనీ నిండేవి.

                          బొజ్జ గణపయ్య వినాయక చవితి కైతే సందడే సందడి. మేము పొద్దున్నే లేచి ఒక మైలు దూరంలో వున్న  " ఆయిల్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ " కు వెళ్లి దొంగదారిన కాంపౌండు గోడ దూకి అక్కడున్న పెద్ద తోటలోకి వెళ్ళే వాళ్ళం. అక్కడ లేని పూల చెట్లు గాని పండ్ల చెట్టు గాని, ఇతర వృక్షాలు గాని లేవు. . పూజకు కావాల్సిన పత్రి, మర్రి ఆకులు, మామిడాకులు, మేడి, రావి ,  జువ్వి లాంటి ఆకులు, పూలూ కోసుకొని వచ్చే వాళ్ళం. మా లాగే మరి కొందరు వచ్చే వాళ్లు.

           ముందురోజే వినాయకుడి బొమ్మ తెచ్చే వాళ్ళం కాబట్టి, పొద్దున్నే పత్రి తెచ్చాక, స్నానం చేసి, వ్రతం పుస్తకం తీసుకొని వచ్చీరాని మంత్రాలు చదివి పూజ పూర్తి చేసే వాళ్ళం. అప్పటికి మేము ఏ మంత్రాలూ నేర్చుకోలేదు, నాకైతే ఒడుగు కూడా కాలేదు . అలా చేసే ఆ పూజకే తన్మయత్వం చెందే వాళ్ళం. తప్పనిసరిగా మా అమ్మ కుడుములు చేసేది. సాయంత్రం చంద్రుడు ఎక్కడ కనపడతాడో అని తల వంచుకుని  బెదురుతో నడిచే వాళ్ళం. కథ విని, మళ్ళీ పూజ చేసి ఆరుబయట కూర్చొని, పాటలూ, పొడుపుకథలూ చెప్పుకుంటూ గడిపే వాళ్ళం. అప్పుడు మాకు ఆరు నుంచి పన్నెండేళ్లుండేవి.

                   దసరా అయితే, ఎలాగూ పదిహేను రోజులు శెలవులుండేవి. సరస్వతీ పూజ రోజున శ్రద్ధగా పుస్తకాలను పూజించేవాళ్ళం.ఆయుధ పూజకు ఇంట్లో వున్న పనిముట్లూ, కుట్టూ   మిషనూ , సైకిళ్ళకు , పూజ చేసేవాళ్ళం. అంతకు మించి మా ఇంట్లో ఇంకేమీ ఉండేవి కాదు. మా అమ్మ కొన్నేళ్ళు  బొమ్మలకొలువు పెట్టేది. దశమి రోజు తప్పనిసరిగా గుడికి వెళ్ళేవాళ్ళం. శమీ చెట్టుకు పూజ చేసి, ప్రదక్షిణ చేసి, పెద్దలకు పత్రి ఇచ్చి, కాళ్ళకు నమస్కారం చేసేవాళ్ళం. అదేదో భక్తితో అనుకునేరు, ఆరోజు నమస్కరిస్తే, తప్పకుండా డబ్బులిచ్చేవాళ్ళు, అందుకని. మా పాఠ్య పుస్తకాల్లో దసరా గురించిన పాఠంలో, ’ అయ్యవారికి చాలు ఐదు వరహాలు, పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు ’ అని ఉండేది. స్కూల్లో టీచర్లు, అదేదో రూల్ ఐనట్టు, ప్రతి సారి పప్పు బెల్లాలు పంచేవారు. మేము ఏనాడూ అయిదు రూపాయలిచ్చిన పాపాన పోలేదు . 

         
                  మధ్యాహ్నమంతా పుల్లన్న బస్సుల్లో విహారం చేసేవాళ్ళం. ఆ రోజుల్లో బస్సుల పుల్లన్న అని ఒకాయన " శ్రీ వెంకటేశ్వరా ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ "  నడిపేవాడు. ఆయుధపూజ రోజంతా పూలు, మామిడాకులు, గంధం బొట్లతో అలంకరించిన తమ బస్సుల్లో పిల్లలందరికీ  free ride ఏర్పాటు చేసేవాడు. ఒకోసారి అదే రోజు పీర్ల పండగ వచ్చేది. ముస్లిం సోదరులు పీర్లు పట్టుకొని ఊరేగింపుగా వెళ్ళేవారు. బస్సు కిటికీలోంచి అదంతా ఆసక్తిగా చూసేవాళ్ళం. 

          దీపావళి కి కూడా కొత్తబట్టలు తప్పనిసరిగా వుండేవి. నరక చతుర్దశి రోజు ఉదయాన్నే తలంటిపోసుకుని, టపాకాయలు కాల్చే వాళ్ళం. ఇంటిబయట అంతా దీపాలు పెట్టి చిచ్చుబుడ్లు, విమానాలు, ఇలా రకరకాలుగా కాల్చే వాళ్ళం. ఒకసారి దీపావళికి మా నాన్న దగ్గర డబ్బులు లేవు, అప్పుడు మేము కేవలము పాత న్యూస్ పేపర్లు రంగు కాయితాలు మొ.. నవి కాల్చాము, నాకు బాగా గుర్తు. రంగు కాగితాలు కాల్చినా రంగు మంటలు వచ్చేవి కావు . 

                                    వైకుంఠ ఏకాదశికి మా అమ్మ తప్పనిసరిగా గుడికి వెళ్ళేది. శివరాత్రికి కూడా గుడికి వెళ్ళి వచ్చేది. ఆ రోజు మేము, రెండవ ఆట, నాల్గవ ఆట సినిమాలు చూసే వాళ్ళం. ఇలా రాస్తూ వెళితే ఇదేదో పండగలపై వ్యాసంలా కనిపించినా, ఆశ్చర్యం లేదు. 

                      పండగ అని కాకపోయినా, ఎపుడైనా స్వీట్లు , కోడు వడలు (చేగోడీలు) , చక్కిలాలు ( జంతికలు ) , అత్తి రసాలు  చేసేది. మేము ఒకే రోజులో ఖాళీ చేస్తామేమో అని ఒక డబ్బాలో పోసి, మాకు అందకుండా పైన అటక మీద పెట్టేది. అది గమనించి, మేము చల్లగా ఆ డబ్బా దింపి, నేల మీద ఒక మూల పెట్టుకొనే వాళ్ళం. అటక పైన ఏదైనా అలాంటిదే ఒక ఖాళీ డబ్బా పెట్టి ఏమీ తెలియనట్లు ఉండే వాళ్ళం. మా అమ్మ చూపులెప్పుడూ పైని డబ్బా మీదనే ఉండేవి. మేము అటు పోతూ, ఇటు వస్తూ ఆ మూల డబ్బా లోంచి స్వీట్లు లాగించే వాళ్ళం. సాయంత్రంగా అది తెలిసికొని బుగ్గలు సొట్టలు పడేలాగా స్వచ్ఛంగా నవ్వేది కానీ తిట్టేది కాదు. ఆ రవ లడ్లు , అత్తిరసాలు ( అరిసెలు ), ఇతర చిరు తిళ్ళు  చేయాలంటే రెండు రోజుల ముందే విసురు రాయి ( తిరగలి) లో పిండి, చక్కెరా లాంటివి విసిరివుంచుకునేది పాపం. ఐతే విసరడంలో ఎపుడైనా సాయం  చేసేవాళ్ళం. అపుడే తెలుసు ఏదో చిరుతిండి చేయబోతున్నదని !

           ఒకసారి మా పెద్దన్న కడుపు లో ఉన్నపుడు ఎప్పుడూ పాములు కలలోకి వచ్చేవట. ఒక రాత్రి ఏదో పని మీద దొడ్లో తలుపు తీస్తే ఎదురుగా నిలువెత్తు నాగు పాము పడగ ఎత్తి నిలుచుందట. అమ్మని చూసి, పడగ దింపి వెళ్ళిపోయిందట. అలా కడుపుతో ఉన్నవాళ్ళకి పాము కనబడితే, ఆ పుట్ట బోయే వారివల్ల కష్టాలు తప్పవంటారు. అది ఒక మూఢ నమ్మకమే ఐనా, మా అమ్మ విషయంలో నిజమే అయింది. 

           మరో సారి ఎదురింటి మేడ మీద చిన్ని కృష్ణుడు పాకుతూ, ఆడుతూ కనిపించాడట.  వాళ్ళ చిన్నప్పుడు పొలాల్లో కొరివి దయ్యాలు గున గునా నడుస్తూ పోవడం చూసిందట. ఈ విషయాలు ఎన్నో సార్లు చెప్పింది కానీ వాటి అర్థం ఇప్పటికీ విశ్లేషణ కు అందడం లేదు. ఇలాంటి విషయాలు అమ్మ చెబితే మాకు అవన్నీ మామూలు విషయాలుగా అనిపించేవి , ఏమీ ఆశ్చర్యం వేసేది కాదు . ఇప్పుడు తలచుకుంటే రోమా లు నిక్కబొడుచుకుంటాయి 


          పై వన్నీ చదివాక, చెప్పండి, అన్నీ మామూలు విషయాలే కాదంటారా ? . ఐతే, ఆర్భాటాలు, బడాయిలూ లేని అవన్నీ మధుర స్మృతులు. ఎందుకంటే, ఆ రోజులు, ఆ పరిస్థితులు మళ్ళీ రావు. అవన్నీ మా అమ్మలోని ఒక కోణాన్ని ఎంతో అందంగా  చూపుతాయి. ఆ అనుభవాలు మనిషి మానసిక ఆరోగ్యానికి కావలసిన  ముఖ్యమైన వాటిలో భాగాలు. . ఈనాడు పల్లెలలో కూడా అటువంటి సంబరాలు అంతరించి పోతున్నాయి.

Sunday, November 4, 2012

సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్


     
ఇది చదివి కంటి  చూపు వేగముగా మెరుగు పరచుకొని , పూర్తి ఆరోగ్యము పొందండి






     ఆరోగ్యం భాస్కరాదిఛ్చేత్ ..అంటారు .. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. అంతే కాదు , మంచి కంటి చూపు కూడా ఇస్తాడు . జాతకంలో  సూర్యుడి స్థితిని బట్టి జాతకుని కంటి చూపెలా ఉంటుందో చెబుతారు 

     ఇవన్నీ వినడానికి బాగున్నాయి . అసలెవరైనా దీని మీద ఒక పరిశోధన గానీ ప్రయోగము కానీ చేసి ఫలితాలు చూశారా ? అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది . "  సూర్య థెరపీ " అని ఏదైనా ఉందా ?  నాకు వీటి గురించి మొదట్లో తెలిసేది కాదు . 1993  నుంచీ కంప్యూటర్ పై చాలా పని చేసేవాడిని . రోజుకు 18 గంటలు . ఇంకేముంది ? రెండేళ్ళకే అద్దాలు వచ్చాయి , సరే వయసు కూడా వచ్చింది కదా , ఇది వయసు ప్రభావము అనుకున్నా. 

     2006  లో ,  మా నాన్నగారు ఎప్పుడో 1937  లో రాసిన ఒక రాత పుస్తకము  నా కంట బడింది . అందులో సూర్యుడికి అర్ఘ్యము ఇచ్చే పద్దతి , దాని ఫలితాలు విపులముగా  ఆయన దస్తూరితో రాసి ఉంది . ఆ పుస్తకము అన్నేళ్ళూ నేను చూడక పోవడమే ఆశ్చర్యం . ఆయన 1995  లోనే స్వర్గస్తులైనారు . ఆ తరువాత , అందులోని విషయమే ఇంకో పుస్తకము లో కూడా చదివాను . అప్పటికి నా కళ్ళ పరిస్థితి ఘోరముగా ఉండింది . రోజూ తలనొప్పి , తల తిరగడము , ఒకరకమైన వికారము ఉండేవి .  రెండు మూడు నెలలకు ఒకసారి కళ్ళజోడు మార్చాల్సి వచ్చేది .

      ఒకసారి మహా ఇబ్బంది పడి , 2008 లో , మా నాన్న గారి పుస్తకములోని ప్రకారము సూర్యుడికి అర్ఘ్యము రోజూ ఇచ్చుట  మొదలు పెట్టాను . ఒక పదిరోజులకే కళ్ళ మంటలు పూర్తిగా తగ్గిపోయాయి . తలనొప్పి , వికారము పూర్తిగా తగ్గాయి . నెలరోజులకే నా కళ్ళు చల్లగా , అంతకు ముందు కుంచించుకుని సగం మూసినట్టు ఉండేవి పూర్తిగా , సహజంగానే విప్పారినాయి . ఆరునెల్లయింది , అంతా బాగా ఉంది . 

     ఒకసారి డాక్టరు దగ్గరకు వెళ్ళాను , ఊరికేనే  ( మాకు అక్కడ సంవత్సరానికి రెండు సార్లు ఉచితముగా చూస్తారు . ) వారు చూసి , కళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి , అదే కళ్ళజోడు వాడండి , ఇంకేమీ అవసరము లేదు అన్నారు . అంతకు ముందు ప్రతిసారీ కళ్ళ సైటు మారింది అని వేరే రాసిచ్చేవారు . నేనేమీ మాట్లాడకుండా వచ్చాను . తర్వాత ఆరునెల్లకు మళ్ళీ ’ ఊరికే ’ వెళ్ళాను . మళ్ళీ అదే మాట, కళ్ళకి ఏ ఇబ్బందీ లేదు , అదే కళ్ళజోడు అని . అప్పుడు అడిగాను , ’ మరి అంతకు ముందు ప్రతి మూడు నెలలకీ జోడు మార్చవలసి వచ్చేది కదా , నా కంప్యూటర్ పని ఏమీ తగ్గలేదు , మరి ఎందుకు నాకు ఇబ్బంది కలగ లేదు ? ’  అని . ఆ డాక్టరు గారికి విదేశాలలో కూడా మంచి పేరుంది . కానీ ఆయన జవాబు చెప్పలేదు , ’ అరుదుగా  కొంతమందికి అనుకోకుండా కళ్ళు బాగవుతాయి , దానికి కారణాలు చెప్పలేము ’ అన్నారు . 

     అప్పటినుండీ నేను సూర్యుడికి రోజూ అర్ఘ్యము ఇవ్వడము మానలేదు . ఈ విషయము ఒకసారి ఆర్కుట్ లో రాశాను . అది చదివి అర్ఘ్యము ఇచ్చే పద్దతి చెప్పండీ అని చాలా మంది అడిగితే , వారికి రాసిచ్చాను . మధ్యలో వారము పదిరోజులు ఎపుడైనా అర్ఘ్యము ఇవ్వడానికి వీలయ్యేది కాదు . కానీ నాకు ఎటువంటి ఇబ్బందీ కలగలేదు . నేను ఆర్కుట్ లో రాసినది పాటించినవారిలో ఒకరిద్దరు, తమకు కూడా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు . 


     మొన్న అధిక మాసము , తర్వాత పితృపక్షాలు రావడముతో , నాకు వేరే జపాలు ఉపాసనలు ఎక్కువ కావడముతో , రెండు నెలలు అర్ఘ్యము వదలలేదు . రెండు రోజుల కిందట నాకు మళ్ళీ తలనొప్పి వచ్చింది . అప్పుడు అర్ఘ్యము మానేసినది గుర్తొచ్చి , మళ్ళీ నిన్నటినుండీ  మొదలుపెట్టాను . ఈ రోజునుండీ నాకు మళ్ళీ కళ్ళు ఎంతో బాగున్నాయి , తలనొప్పి కూడా అదే పోయింది . డాక్టరు దగ్గరకు వెళితే , మళ్ళీ అదే పాట , మీ కళ్ళకు వచ్చిన ఇబ్బందేమీ లేదు , అదే జోడు అని . 

అందుకని వెంటనే ఇది అందరితో మళ్ళీ పంచుకుందామని రాస్తున్నాను . 


శ్రీ సూర్య నమస్కారం , అర్ఘ్యం చ...లఘునా

 దీనికి కావలసినవి , 1 . ఒక రాగి గిన్నె కానీ చెంబు కానీ . 2  .ఎర్ర చందనము . ఇది చెక్కలుగా దొరుకుతుంది , కొన్ని చోట్ల పొడిగా కూడా దొరుకుతుంది . చెక్క తీసుకుంటే , రోజూ గంధము తీయాలి , పొడి అయితే దాన్ని రుద్ది గంధము చేయుట సులభము . ఓ నూరు రూపాయల చెక్క గానీ , పొడిగానీ కొనుక్కుంటే సంవత్సరము పైన వస్తుంది .   ఇదికాక, రోజూ కొన్ని ఏవైనా ఎరుపు రంగు పూలు కావాలి . ఒక కుండీలో కనకాంబరాలు కానీ , ఇంకేవైనా ఎర్ర పూలిచ్చే గులాబీ , మందారము వంటి చెట్టుకానీ పెట్టుకోండి . 

విధానము 

స్నానము, సంధ్యావందనము ముగించి , 
మొదట ఎర్ర చందనము గంధము తీసి ( ఒక బటాణీ గింజంత అయినా చాలు ) రాగి చెంబులోని నీటిలో కలపండి . బాగా ఉద్ధరిణతో కలియబెట్టి , అందులోకి చిన్న చిన్న పూలు గానీ , పెద్ద పూలైతే వాటి రేకులు గానీ కలపండి . 

తర్వాత  సూర్యునికెదురుగా నిలిచి  ఈ కింది మంత్రము చెప్పి నమస్కరించండి 

సూర్య మంత్రం 

||  ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతి కరాయ ధీమహి 

తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ||

     తర్వాత కింది మంత్రము చెప్పుచూ ఇరవైనాలుగు సార్లు ఆత్మ ప్రదక్షిణము చేస్తూ , ప్రతి ప్రదక్షిణము తర్వాత , పూర్తి సూర్య నమస్కారము గానీ ( యోగా పద్దతిలో ) , లేదా , ఊరికే సాష్టాంగ నమస్కారముగానీ , అదీ వీలు కాకున్న , వంగి నేలను ముట్టి నమస్కారము గానీ చేయండి . ఇరవై నాలుగు సార్లు వీలుకాకున్న , పన్నెండు సార్లో , అదీ వీలుకాకున్న ఆరు సార్లో  చేయండి . అయితే శ్రద్ధ ముఖ్యము. వీలైనన్ని ఎక్కువ సార్లు చేయుటకే ప్రయత్నించండి .మొదట ఒక వారము రోజులు  అలవాటు అయ్యేవరకూ కాస్త కష్టమనిపించవచ్చు . ఆ తర్వాత అలవాటుగా , గబగబా చేసేస్తారు . మంత్రము కూడా అప్పటికి నోటికి వచ్చేస్తుంది . 

 సూర్య నమస్కారం 

||  వినతా తనయో దేవః కర్మ సాక్షీ సురేశ్వరః 
సప్తాశ్వ సప్త రజ్జుశ్చ అరుణో మే ప్రసీదతు ||


|| మిత్ర , రవి , సూర్య, భాను , ఖగ , పూష , హిరణ్య గర్భ, మరీచ , ఆదిత్య , సవిత్ర , అర్క , భాస్కరేభ్యో నమః ||

ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి.

( పై మంత్రము 24  పర్యాయములు చెప్పి  ప్రతిసారి  ప్రదక్షిణ సాష్టాంగ నమస్కారములు చెయ్య వలెను )


ఆ తర్వాత ,. సూర్య అర్ఘ్యం  

ఈ కింది మంత్రము చెప్పి రాగి చెంబులోని  గంధము  , పూలు కలిపిన నీటితో మూడు సార్లు కానీ , పన్నెండు సార్లు కానీ అర్ఘ్యము వదలండి. అర్ఘ్యము వదలునపుడు లేచి నిలుచొని, దోసిటి నిండా చెంబులోని నీళ్ళు తీసుకుని , మంత్రము చెప్పి , అంజలితో కిందికి వదలండి , లేదా , ఏ చెట్టు మొదట్లోకో , కుండీ లోకో వదలండి . 

||  నమస్సవిత్రే జగదేక చక్షసే  | జగత్ ప్రసూతి స్థితి నాశ హేతవే |

త్రయీ మయాయ త్రిగుణాత్మ ధారిణే | విరించి నారాయణ శంకరాత్మనే ||

శ్రీ ఉషా సంజ్ఞా ఛాయా సమేత సూర్య నారాయణ పర బ్రహ్మణే నమః 
ఇదమర్ఘ్యం సమర్పయామి  (ఎర్ర చందనము , ఎర్ర పూలు కలిపిన నీళ్ళతో  మూడు పర్యాయములు )

౩. తర్వాత సూర్య ధ్యానం 

ఈ శ్లోకము చెప్పి మనసులో సూర్యునికి నమస్కరించండి .

||  ధ్యేయస్సదా సవితృ మండల మధ్య వర్తి | నారాయణ సరసిజాసన సన్నివిష్టః |
కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ | హరీ హిరణ్మయ వపుర్ధృత శంఖ చక్రః |

ఉదయం బ్రహ్మ స్వరూపం మధ్యాహ్నం తు మహేశ్వరః | అస్తమానే స్వయం విష్ణుః త్రిమూర్తిశ్చ దివాకరః || 


సమాప్తం



రోజూ సంధ్య వేళలలో ఈ స్తోత్రము చదువుకోండి సర్వ శుభములూ పొందండి . 
ఏక వింశతి సూర్య నామాని 
( హోమాదులలో ఉపయోగించవచ్చును.  సంధ్యా కాలం లో పఠించిన , సర్వ పాప ముక్తులు అగుదురు )

|| వికర్తనో వివస్వాం చ మార్తాండో భాస్కరో రవిః | లోక ప్రకాశకః శ్రీమాన్ లోక చక్షుర్గ్రహేశ్వరః | 
లోక సాక్షీ త్రిలోకేశః కర్తా హర్తా తిమిస్రహా | తపనస్తాపనశ్చైవ శుచిస్సప్తాశ్వ వాహనః |
గభస్తి హస్తో బ్రహ్మా చ సర్వ దేవ నమస్కృతః | ఏక వింశతిరిత్యేష స్తవ ఇష్టస్సదా మమ | 
శరీరారోగ్యదశ్చైవ ధన వృద్ధి యశస్కరః | స్తవ రాజ ఇతి ఖ్యాతస్త్రిషు లోకేషు విశ్రుతః || 

సూర్యస్తవము 
( బ్రహ్మ ఉపదేశించినది-- భవిష్య పురాణము  ) 

* నమస్సూర్యాయ నిత్యాయ రవయే కార్య భానవే | భాస్కరాయ మతంగాయ మార్తాండాయ వివస్వతే |
ఆదిత్యాయాది దేవాయ నమస్తే రశ్మి మాలినే | దివాకరాయ దీప్తాయ అగ్నయే మిహిరాయ చ | 
* ప్రభాకరాయ మిత్రాయ నమస్తేఽదితి సంభవ | నమో గోపతయే నిత్యం దిశాం చ పతయే నమః | 
నమో ధాత్రే విధాత్రే చ అర్యమ్ణే వరుణాయ చ | పూష్ణే ఖగాయ మిత్రాయ పర్జన్యాయాంశవే నమః | 
* నమో హితకృతే నిత్యం ధర్మాయ తపనాయ చ | హరయే హరితాశ్వాయ విశ్వస్య పతయే నమః | 
విష్ణవే బ్రహ్మణే నిత్యం త్ర్యంబకాయ తథాత్మనే | నమస్తే సప్త లోకేశ నమస్తే సప్త సప్తయే | 
*ఏకస్మైహి నమస్తుభ్యమేక చక్ర రథాయ చ | జ్యోతిషాం పతయే నిత్యం సర్వ ప్రాణ భృతే నమః | 
హితాయ సర్వ భూతానాం శివాయార్తి హరాయ చ | నమః పద్మ ప్రబోధాయ నమో వేదాది మూర్తయే | 
* కాదిజాయ నమస్తుభ్యం నమస్తారా సుతాయ చ | భీమజాయ నమస్తుభ్యం పావకాయ చ వై నమః |
ధిషణాయ నమో నిత్యం నమః కృష్ణాయ నిత్య దా | నమోఽస్త్వధితి పుత్రాయ నమో లక్ష్యాయ నిత్యశః|
( సర్వాభీష్ట సిధ్ధి కి ప్రాతః సాయంకాలాలు పఠించ వలెను ) 
----------

తరువాత కానీ , అర్ఘ్యమునకు ముందేకానీ తల్లిదండ్రులకు నమస్కరించండి .

మాతా పితర వందనము

మాతృ నమస్కారం

|| యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః | నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం |
కృఛ్చ్రేణ మహతా దేవ్యా ధారితోహం యథోధరే | త్వత్ప్రసాదాజ్జగదృష్టం మాతర్నిత్యం నమోస్తుతే |
పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః | వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే ||

పితృ నమస్కారం

|| స్వర్గాపవర్గ ప్రదమేక మాంద్యం బ్రహ్మ స్వరూపం పితరం నమామి
యతో జగత్పశ్యతి చారు రూపం తం తర్పయామస్సలిలైస్తిలైర్యుతైః || 
పితరో జనయంతీహ పితరో పాలయంతి చ |
పితరో బ్రహ్మ రూపాహి తేభ్యో నిత్యం నమో నమః |
యస్మాద్విజయతే లోకస్తస్మాద్ధర్మః ప్రవర్తతః |
నమస్తుభ్యం పితస్సాక్షాత్ బ్రహ్మ రూప నమోస్తుతే || 

సమస్త సన్మంగళాని భవంతు

Tuesday, October 30, 2012

3. " జీవిత చుక్కాని " మూడవ అంకం మాధుర్యం


మూడవ అంకం                                     మాధుర్యం


      ఈ అంకం లో అమ్మ పెళ్ళయ్యాక కొత్తలో పడిన తికమకలు , పిల్లల ఆలన , మా చిన్నతనం , అందరికీ అమ్మ మీద అభిమానం , అమ్మ సౌహార్ద్రం , గృహ సౌఖ్యం వంటి తీపి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి....

      పెళ్ళయినా అమ్మ రెండేళ్ళు పుట్టింటిలోనే ఉంది. అతి చిన్న వయసులో పదమూడేళ్ళకే పెళ్ళి జరిగినా, అమ్మ ఆలోచనలు మాత్రం పరిపక్వంగా వుండేవి. గొప్ప నిర్ణయాలు తీసుకొనే శక్తి అప్పటికే ఉంది.  ముఖ్యమైన సమయంలో అమ్మ ఇంత గొప్పగా స్పందిస్తుందని మా తాతయ్య గానీ , మేనమామలు గానీ అనుకోలేదు .      

వింత నాటకం

      తమ మేనమామ చెల్లెలికి తెచ్చిన సంబంధం అన్నలకు ఎంతమాత్రమూ ఇష్టం లేదు . బళ్ళారిలోని సంపన్న కుటుంబానికి , అందులోనూ , పరివారము దండిగా ఉన్నవారికి ఇచ్చి చేయాలని వారి ఆశ.  కానీ  తండ్రి , మేనమామల మాటకి ఎదురు చెప్పలేకపోయారు. వారి ఇష్టాలతో ప్రమేయం లేకుండా పెళ్ళి ఘనంగా జరిగింది. అయిదు రోజుల పెళ్ళి.  అమ్మాయి మరీ చిన్న పిల్ల కాబట్టి, కాపురానికి తరువాత పంపిస్తామన్నారు. ’కాదు, వెంటనే పంపవలసిందే ’ అని పట్టు పట్టాడు నాన్న . అందుకు బావ మరుదులు  ఒప్పుకోలేదు. ఇంకా చిన్న పిల్ల. మంచీ చెడ్డా తెలిసే వయసుకాదు ,  ఇంటి పనులు నేర్పించి పంపిస్తాము ’ అన్నారు.  వారిమీద కోపంతో వారిని దారికి తెచ్చుకోవాలని మా నాన్న ఒక వింత నాటకమాడారు. అదే అమ్మని భయపడేలా చేసి, వదంతులు నమ్మేలా చేసింది.  పెళ్ళయ్యీ ,  భార్య కాపురానికి రాని వ్యక్తి, అందులోనూ, ఒంటరివాడు, పెద్ద దిక్కు లేని వాడు. ఇంట్లో దీపం పెట్టేవారు లేరు, పెళ్ళయ్యాక కూడా ఈ ఒంటరి కష్టాలు ఎందుకనుకున్నాడు నాన్న.  దాన్ని పరిష్కరించుకోవాలని,  బావ మరుదులను  భయపెట్టడం  జరిగింది. కాపురానికి రాకముందే అమ్మకు సవతి పోరు తప్పదనీ , అన్యాయం జరిగిందనే వదంతి ఆ నోటా, ఈ నోటా అమ్మ వరకు వచ్చింది. తానా, ఐదో క్లాసు మించి చదువుకోలేదు. నిండా ౧౫ ఏళ్ళు లేవు. ఎటూతోచని పరిస్థితి. లోక జ్ఞానముందని ఎలా అనుకుంటాము ? ఈనాటిలాగా చదివి తెలుసుకోడానికి అప్పుడు విరివిగా కథల పుస్తకాలుండేవి కాదు, . సినిమాలనేవి  అప్పటికి ఇంకా ఎవరికీ తెలీదు.   ఆడదిక్కు లేని ఇల్లు. తల్లి ముందే పోయింది. ఉన్న ఒక్క అక్క కూడా పెళ్ళై అత్తవారింట్లో ఉంది.. చెల్లెలు మరీ చిన్న పిల్ల. ఆ ఇంటికి తానే ఆడ దిక్కు. ఆ సమయంలో  , ఆ దేశ కాల పరిస్థితులలో ఆమె తీసుకున్న నిర్ణయం అత్యంత సాహసోపేతమైనదనే చెప్పాలి.

      తన భర్త తన వాళ్ళ పై ’ గుర్రు ’ గా ఉన్నాడు. తన కాపురం ఏమౌతుందో అన్న భయం. అనుభవ రాహిత్యం. అవగాహన అనేది ఏముందో ఏమో ? భర్త దగ్గరకు వెళతానని తెగేసి చెప్పింది. అందరూ వారించారు, కాస్త ఆగమని. ఒక వైపు భర్త నుంచి  ఒత్తిడి. ఇంకా ఏమేమి జరిగిందో మరి, ఆమెకే తెలుసు.

ఇచ్చిన మాట

      " నాకు మీ అందరి కంటే నా భర్తే ముఖ్యం. మీతో నాకు పని లేదు " అని చెప్పించేలా పరిస్థితులు కల్పించబడ్డాయి. అందరూ అవాక్కు. తనని తీసుకు వెళ్ళడానికి భర్త రాలేదు. అన్నదమ్ములు పంపడానికే ఒప్పుకోలేదు , మరి తీసుకెళ్ళుతారా ? సమయానికి మేనమామ దగ్గర లేడు . నాన్న ఎటూ చెప్పలేకపోయినారు . ఎడ్ల బండిలో కొందరు వితంతువులు బళ్ళారి వెళుతుంటే వారిని బ్రతిమాలి , కొద్ది పాటి సారెతో బయలు దేరింది. బళ్ళారిలో భర్త ఇంటిదగ్గర దింపారు .తనని చూసి , ఆశ్చర్యపోయిన భర్త  ఒకే షరతు పెట్టాడు, .  " మళ్ళీ ఎప్పుడూ పుట్టింటికి నా అనుమతి లేకుండా పోకూడదు .  అలాగైతేనే ఇంట్లోకి రా". అని. రెండో మాట లేకుండా ఒప్పుకుంది.  50  సంవత్సరాలు అంటే చనిపోయే వరకు ఆ మాట మీదే నిలబడింది. 50 సంవత్సరాలు ! ఇది సినిమా కాదు. నిజంగా జరిగింది.ఆ వూరికీ, ఈ వూరికీ మధ్య 50 కిలో మీటర్లు కూడా లేవు. మధ్యలో కానుపులకు, పెళ్ళిళ్ళకు, ఏ మూడు నాలుగు సార్లో మాత్రమే  భర్త దయ తలిస్తేనే వెళ్ళింది. పుట్టింటి వాళ్ళే ఎప్పుడైనా వచ్చి చూసేవారు. వస్తే ఒక పూట కూడా ఉండే వారు కాదు. ఒక సారి కానుపుకని, భర్త ఒప్పుకుంటాడు అనే నమ్మకంతో, ఎడ్ల బండిలో  వెళ్ళింది. పుట్టింటి వారు మొదట్లో సంతోషించినా, తర్వాత ఆడదిక్కు లేదని భయపడి వాపసు పంపేశారు. నెలలు నిండిన గర్భిణి, మళ్ళీ బండిలో వాపసు వచ్చేసింది. అనుమతి లేకుండా ఎందుకెళ్ళావు? చెల్లెలిని ఆమాత్రం చూసుకోలేనివాళ్ళు నిన్ను కాపురానికి సకాలంలో పంపక ఎందుకు అడ్డుకున్నారు ? జవాబు వాళ్ళనే అడిగి తెలుసుకురా .  అంటూ , గర్భిణి అని కూడా చూడకుండా వెనక్కు తరిమేశాడు భర్త . శ్రీధర ఘట్ట లో  ఆసుపత్రి లేదని, ఇంకో వూరికి అదే బండిలో తరలింపు . అప్పుడు ఒక అన్నగారు తాము చేసింది తప్పేనని అనుకుని వచ్చి  ఆదుకున్నారు. కానీ, అప్పటికే అమ్మ భయాందోళనలకు గురి అవ్వడం వల్లనో, ఇంకెందుకో గానీ, ఆ పుట్టిన పిల్లాడు, ఆరేడు నెలలకే తనువు చాలించాడు. అయితే ఉన్నణ్ణాళ్ళూ ఆరోగ్యంగా ఉండి, చాలా ముద్దుగా ఉండే వాడట.

      తాను కాపురానికి వచ్చిన మొదటిరోజే భర్త ఉన్న ఇంటి గల వాళ్ళ ద్వారా తెలిసిందేమిటంటే, తనని కాపురానికి వెంటనే రప్పించుకోవడానికి భర్త తన మీద తానే పుకార్లు పుట్టించుకుని నాటకమాడాడని !

మరువ లేని జ్ఞాపకాలు

                               కానీ, భార్యని కాపురానికి రానీకుండా రెండేళ్ళు పుట్టింటిలోనే ఉంచుకున్నారని, బావ మరుదులపై కోపం పోలేదు.  క్రమేణా  రాకపోకలు పూర్తిగా తగ్గిపోయాయి. తనకూ సంసారం, పిల్లలు, వారి ఆలనా పాలనా, బాధ్యతలు ఎక్కువయ్యాయి. ఇక పూర్తిగా పుట్టింటిని మరచిపోయింది . మరచిపోయింది అనేకంటే అలా అందరు అనుకున్నారు అంటే సబబుగా ఉంటుంది . ఎన్నోసార్లు తాను ఒక్కత్తెనే ఉన్నాననుకొని, అమ్మ కంట తడిపెట్టుకోవడం ఆరేడేళ్ళ పిల్లాడిగా చూసిన నాకు బాగా జ్ఞాపకం. అమ్మ ఏడుస్తుందంటే మనసు దిగాలుగా అయిపోయేది. నన్ను గమనించిన అమ్మ, ఏమీ తెలీనట్టు, ’ పాడు పొగ ’ అని తిట్టుకొనేది .నేనొక్కడే కాదు,మా అక్కలు, అన్నలు కూడా ఇలాంటివి చాలా చూశారు.   అప్పట్లో వంట అంతా కట్టెలు, వంట చెరుకుతోనే కదా. పచ్చి కట్టెలు కాలక ఒకోసారి ఇల్లంతా పొగతో నిండిపోయేది. వూదుగొట్టంతో వూపిరితిత్తులు అలసిపోయేలా వూదేది. నాకు అత్యంత పాత జ్ఞాపకం ఏంటంటే , అపుడు నా వయసెంతోగానీ,  తన కాళ్ళు రెండూ చాచి, మా తమ్ముణ్ణి కాళ్ళపై పడుకోబెట్టుకొని, వాడిపై నీళ్ళు పోసేది.  తర్వాత కాలంలో కూడా మా అక్కయ్యల పిల్లల్ని  అలాగే పడుకోబెట్టుకుని నీళ్ళు పోసేది. నీళ్ళు పోసేటప్పుడు ఏడుస్తారని, ముఖం నిండా అంతులేని సంతోషం చూపిస్తూ, " బుడుకూస్ " అంటూ తలని పైనుంచీ కిందికి ఒక్కసారిగా ఆడిస్తూ  నవ్వుతూ నీళ్ళు పోసేది. ఆ ’ బుడుకూస్ ’ అనే పదంలో, ’ బు ’  మరియు  ’ డు ’  అక్షరాలను కలిపి ఒకే అక్షరంగా పలికేది ’ బ్డు ’ లాగా. ’ కూ ’ ని దీర్ఘం తీస్తూ ’ కూ..... ’ అని పాటలాగా పలికేది.

                దీనికి ఓ  పదేళ్ళు వెనక్కి వెళితే, అదే, నేను పుట్టక ముందు, అప్పటికి మా పెద్దక్కయ్యకు 16--18  ఏళ్ళుంటాయి. మిగిలినవాళ్ళంతా చిన్న వాళ్ళు. చిన్నపుడే చనిపోయిన అన్నయ్య తో పాటూ, నాకూ, మా పెద్దక్కయ్యకూ మధ్యలో ఇంకా 10 మంది ఉన్నారు. చనిపోయిన అన్న పేరు  ’ శేషాద్రి ’ అట. ఆ పేరు మన కుటుంబంలో ఎవరూ పెట్టుకోకూడదు, మనకు అచ్చిరాదు అని మా నాన్న చెప్పేవాడు. ’ శేష ’ అనే పదమే వద్దనే వాడు. తర్వాత రెండు సార్లు మా అమ్మకు గర్భం నిలవలేదని మా అక్కయ్యలు చెబుతారు. ఆ కాలంలో పాతవూరిలో ప్రభుత్వ ఆస్పత్రి ఉండేది. ( చెరువుకట్ట కింద ). ఇప్పటికీ ఆ బిల్డింగు ఉంది కాని ఆస్పత్రి గా కాదనుకొంటాను . కానుపులతో నీరసించి ఏదో ఒక రోగంతో మా అమ్మ బాధపడేది.  అక్కడ చాలా సార్లు అడ్మిట్ అయిందట. తాను ఆస్పత్రిలో ఉంటే చిన్న పిల్లలకి తిండి ఎలా ? పిల్లలు తనతో పాటే  ఆస్పత్రిలో ఉండేవాళ్ళు. ఒక్కోసారి పిల్లలు ఆకలని ఏడిస్తే అర్ధరాత్రయినా సరే, ఇంటికి వచ్చి పూర్తి వంట చేసి పెట్టి వెళ్ళేది.

      ఇంట్లో జరిగీ జరగని పరిస్థితి. మా నాన్న స్కూల్లో పనిచెయ్యడమేగాక కొన్ని ఇళ్ళలో ట్యూషన్ లు చెప్పేవారు. ఇంజనీరింగు కాలేజీలో అప్పటి ప్రిన్సిపాలు శ్రీ దామోదరం గారనే వారింటిలో పిల్లలకి ట్యూషన్ చెప్పేవారు. మా నాన్నకి సంతానమెక్కువని తెలిసి, వాళ్ళు జీతం మాత్రమే గాక మధ్య మధ్య లో బియ్యం, పప్పులు మొ||నవి ఏదో ఒక సాకు చెప్పి ఇచ్చేవాళ్ళట. అమ్మ పెళ్ళై కాపురానికొచ్చిన కొత్తలో, మా నాన్న ఉంటున్న ఇంటి ఓనరు చాలా బాగా ఆదరించారట. వారి పిల్లలకు మా నాన్న  అంతవరకు డబ్బు తీసుకోకుండా ట్యూషను చెప్పేవారట. అందుకని, మా అమ్మకు వారు ఒక బంగారు గొలుసు చేయించి ఇచ్చారు. అదికాక మా అమ్మకి ఒక ఒడ్డాణము, నెక్లెసు, గాజులు, పోగులు, కమ్మలు అన్నీ కలిపి సుమారు ౨౦౦ తులాల బంగారు ఉండేదట.

      కానీ తరువాతి కాలంలో అందులో ఏమీ మిగిలినట్టు లేదు. ఆ రోజుల్లో అప్పుడప్పుడు రాగి సంకటి ( ముద్ద ) చేసేది మా అమ్మ. నీళ్ళు ఎసరు పెట్టి నప్పటి నుంచి మేమందరం తట్టలు ( కంచాలు ) తీసుకొని పొయ్యి చుట్టూ కూర్చొనే వాళ్ళం. ’  మొదటి ముద్ద నాకంటే నాకు ’ అని పోట్లాటలు.

      ఇవన్నీ ఒక ఎత్తయితే, మా నాన్న తో వేగడం ఇంకో ఎత్తు. ప్రతిదానికీ ఆయనకి ముక్కుమీదే కోపం. నోటికి వచ్చినట్టు దుర్భాషలాడి, మా అమ్మని ఒకోసారి కొట్టేవాడు. చారులో ఉప్పు తక్కువైనా తప్పే, తన కళ్ళజోడు కనిపించకున్నా మా అమ్మ తప్పే, చివరికి,ఇంటికి ఏమైనా కావాలని అడిగినా తప్పే. మా నాన్న ఇంట్లో ఉంటే మేమంతా ఎలకపిల్లలు కలుగులో ఉన్నట్టు, అక్కడా, ఇక్కడా దాక్కొని ఉండే వాళ్ళం. ఆ బాధలు భరించలేక ఒక్కోసారి మా అమ్మ, పక్కనే ఉన్న దిగుడు భావిలో దాక్కునేది. మా ఇంటికి అర కిలోమీటర్లో " అమ్మవారి చెరువు " అని ఒక చెరువుండేది. అందులో నీళ్ళు మరీ ఎక్కువ లేకున్నా, ఎప్పుడూ ప్రవాహం ఉండి, నీళ్ళు శుభ్రంగా ఉండేవి. మా నాన్న నించి తప్పించుకోవాలని బట్టలు ఉతికే నెపంతో పెద్ద  పిల్లలని తీసుకొని అక్కడికి వెళ్ళి అమ్మ చాలాసేపు గడిపేది. ఒకసారి, కావాలని పడిందో లేక, ప్రమాదవశాత్తూనో గానీ, అమ్మ చెరువులో పడిపోయింది. అక్కడే బట్టలు ఉతుకుతూ ఉన్న చాకలి మహిళలు చూసి, రక్షించి పిలుచుకు వచ్చారు. మాకు తెలిసి మా అమ్మ కు ఇలాంటి బాధలు చాలానే , కానీ మాకు తెలీకుండా ఆమె ఎన్ని బాధలు పడిందో, ఆమెకు, మా నాన్నకే తెలియాలి.   గుడ్డిలో మెల్ల అన్నట్టు, అప్పటికి సొంత ఇంట్లో, అదీ, వూరికి దూరంగా విసిరేసినట్టు వుండటంతో, మా ఇంటి విషయాలు ఎవ్వరికీ తెలిసేవి కావు.

      ఈనాడు మా అందరికీ ఉన్నత చదువులు, ఉద్యోగాలు ఉన్నా, మేము మా మూలాలు మరచిపోలేదు. డబ్బు, సుఖాలు శాశ్వతం కావు. ఆనాడు మేము ఆర్థికంగా ఎలా వున్నా, క్రమశిక్షణ, సంప్రదాయాలు, పెద్దలకు మర్యాద ఇవ్వడము, లాంటి వాటిలో మాకు మేమే సాటిగా ఉండేవాళ్ళము. చిన్నప్పుడు మేము అంగడికి( కొట్టు ) వెళ్ళి ఏమైనా కొన్నప్పుడు, పొరపాటున మాకు చిల్లర ఎక్కువ వస్తే, వెంటనే వాపసు ఇచ్చే వాళ్ళం. అది మా అమ్మ మాకు నేర్పిన మొదటి పాఠాల్లో ఒకటి.

గోమాత

              నేను పుట్టకముందు, తర్వాత కూడా,  మా ఇంట్లో ఆవులు, గేదెలు ఉండేవి. ఒకసారి మా ఆవు ఈనడానికి సిద్ధంగా వుంది. ఉదయాన్నే అది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ, ముందుకూ వెనక్కూ నడుస్తూ, ’ అంబా ’ అంటూ అరుస్తున్నది. విషయం అర్థమైన మా అమ్మ ఆరోజు ఉదయం మాకు తినడానికి ఎంతసేపటికీ ఏమీ చెయ్యలేదు. ఐదు నిమిషాలకోసారి ఆవు దగ్గరకెళ్ళి, దాని తల, గంగడోలు నిమిరి దానితో ఏమో మాట్లాడేది. ఏదో  అర్థమైనట్టు అది తల వూపేది. మా అమ్మ అటు వెళ్ళగానే కొన్ని నిమిషాలకే మళ్ళీ అరిచేది. మళ్ళీ మా అమ్మ వచ్చేది. వీపు నిమిరీ, తల నిమిరీ ఏదో చెబుతూ వుండేది. మా అమ్మ వున్నంతసేపు అది మామూలుగా వూరికే ఉండేది. మా అమ్మ వెళ్ళగానే మళ్ళీ అరుపు. అలాగ సుమారు ఒక గంట తర్వాత అది ఈనింది. వెంటనే అమ్మ దానికి బెల్లము, ఏవో ఆకులు, పళ్ళు తినిపించింది. కడుగు నీళ్ళు ( కుడితి ) తాగించింది. ఆ దూడకు హారతి ఇచ్చి, లోపలికి వెళ్ళింది. ఆ ఆవు తనదూడ వొళ్ళంతా నాకి శుభ్రం చేసే వరకు మమ్మల్ని దాని దగ్గరకు వెళ్ళనిచ్చేది కాదు.

       ఆ ఆవుకి పాలు పిండాలంటే, మా అమ్మ మాత్రమే ఆ పని చెయ్యాలి. పిల్లలము మాదగ్గర ఆ ఆవు గారాలు పోయేది. తల దువ్వితే దువ్వించుకునేది. గంగడోలు నిమిరితే, మోర ఎత్తి నిమిరించుకునేది. కానీ మా అమ్మ, మరియు  తన దూడ తప్ప ఇతరులు ఎవరైనా పొదుగు ముట్టుకుంటే, వాళ్ళని కాలితో తన్నేది. ఒకసారి  అమ్మకు ఆరోగ్యం బాగలేక, మా పెద్దన్న పాలు పిండాలని అనుకున్నాడు. మా అమ్మ చీర ఒకటి కట్టుకుని, పాలు పిండడం మొదలు పెట్టాడు. సరిగ్గా అప్పుడే మా అన్నని ఎవరో ఏదో అడిగారు. మా అన్న, పాలు పిండుతూనే జవాబిచ్చాడు. అంతే, మా అన్న గొంతు వినగానే, ఆవు ’ ఫెడీ ’ మని  కాలితో ఒక తన్ను తన్నింది. ఇప్పుడది తలచుకుంటే ఇంకోటి గుర్తు వస్తున్నది.

                   నా చిన్నప్పుడు, N.T.R  , వాణిశ్రీ నటించిన  " చిన్న నాటి స్నేహితులు "అనే సినిమాకి ,మా అమ్మ, మా ౪వ అక్కయ్య కలసి వెళ్ళారు. ఆ సమయంలోనే, మా పెద్దక్కయ్య, మరియు మూడో అక్కయ్య ఇద్దరూ నెలలు నిండి  ఇంచుమించు ఒకే సారి  గర్భిణితో ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇంట్లోనే వుండిపోయారు. వాళ్ళకు చాలా జాగ్రత్తలు చెప్పి మరీ వెళ్ళింది. అది కూడా, ఇంట్లో వుంటే, వారిని చూస్తూ ఆందోళన  పడేదని, ఎవరో సలహా ఇచ్చినందుకు వెళ్ళింది. అదేమి చిత్రమో, ఆ సినిమాలో వాణిశ్రీ, దేవికలు కూడా ఒకే సారి గర్భవతులై, ప్రసవ వేదన పడే సీన్లున్నాయి. అది చూస్తూ, మా అమ్మ నిలవలేక, సినిమా మధ్యలోనే వదిలేసి, మా అక్కయ్యని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది.

ఆరాధన
                మా అమ్మ ఐదో క్లాసుకు మించి చదువుకోలేదు. బయటి ఉద్యోగం అంటూ ఏమీ లేదు. పొజిషను గానీ, పవరు గానీ లేవు. ఆర్థికంగా అంతంత మాత్రమే. చూడ్డానికి కూడా అందగత్తె అని ఎవరూ అనలేదు. తనకు చట్టి ముక్కు వుంటుందని మా అమ్మకు న్యూనతా భావం ఉండేదేమో. పొడుగ్గా కొనదేలిన ముక్కులు వున్నవాళ్ళు గొప్ప అందగత్తెలని మా అమ్మ ఎప్పుడూ అనుకునేది. సినీ నటి జయప్రద ఫోటో మొదటిసారి చూసినప్పుడు ఎంత మెచ్చుకుందో !  అలా మా అమ్మకు ఏమీ లేకున్నా , మా అమ్మ ప్రభావం చాలా మంది మీద చాలా రకాలుగా ఉండింది. అప్పుడు తెలిసేదికాదు కానీ, ఇప్పుడు ఆలోచిస్తే, అది నిజమే అనడానికి, ఇవన్నీ గుర్తొస్తున్నాయి .

                            చిన్నప్పుడు మా అక్కయ్యలు గానీ, మేము గానీ బయట ఎవరితోనైనా పోట్లాడినప్పుడు, వారు చివరికి ఓడిపోయి, ఉక్రోషంగా, " మీ అమ్మ ముఖం చూసి ఊరుకుంటున్నా " అనేవాళ్ళు. బహుశ, వాళ్ళ పెద్దవాళ్ళు మా అమ్మ మీద గౌరవం వాళ్ళకు కూడా నూరి పోశారేమో.  తర్వాతి కాలంలో . మా మూడవ అక్క, బావగారు మా పక్కింట్లోనే ఉండేవారు.  వాళ్ళ పిల్లలు మా ఇంట్లో ఆడుకుంటూ, ఒక్కోసారి స్నానాలూ, భోజనాలూ అన్నీ మా ఇంట్లోనే చేసేవారు. అది మా బావకి అంతగా నచ్చేది కాదు. అలా చూసినప్పుడు ఎవరు చెప్పినా వినకుండా వాళ్ళని లాక్కుపోయేవారు. అలాగని మేమంటే  ఏదో వ్యతిరేకత అని కాదు. ఆయన మనస్తత్వమే అంత. గంటలు గంటలు మా నాన్నగారితో హస్కు వేసుకుని కూర్చొనేవారు కూడా.  ఐతే మా అమ్మ ఎదురుగా ఎప్పుడూ పిల్లల్ని లాక్కువెళ్ళేవారు కాదు. అలా మా అమ్మ లేదనుకొని ఒక్కోసారి పొరపాటున లాక్కువెళ్ళినప్పుడు, మా అమ్మ చూసి,  " వాళ్ళు ఇక్కడే  భోంచేస్తారు లెండి " అనేది. అంతే, మరి మాట్లాడకుండా వెళ్ళిపోయే వారు.

      ఒక సమయం లో మా చిన్నప్పుడు,  మా ఇంటిమీద మా నాన్న అప్పు చేశారు. ఆకాలంలో ఒక కాబూలీవాలా ఉండే వాడు. వాడికి ఇల్లు ఆయకం ( తనఖా ) పెట్టారు మా నాన్న. అతడు వడ్డీ కోసం వచ్చి , లేదంటే, మా నాన్న గారిని చాలా బెదరించి వెళ్ళే వాడు. అప్పుడు మా అమ్మ ఎదురుగా ఉంటే మాత్రం అదేమిటో, భయంతో నమస్కారం చేసి, " మాజీ, హాయన్కీ కొంచం చెప్పండి "  అని పిల్లి లాగా వెళ్ళిపోయేవాడు. ఆ కిటుకు తెలుసుకొని ఒకోసారి మా నాన్న ఇంట్లో ఉన్నా, లేడని మా అమ్మతో చెప్పించేవారు.

      మా అమ్మ దగ్గరికి వచ్చే మా స్కూలు టీచర్లు గాని, బయటి వాళ్ళు ఎవరైనా సరే, తమలోని మంచి గుణాలు మాత్రమే కనిపించేలా జాగ్రత్త పడేవారనుకొంటాను. నిజానికి వాళ్ళకా అవసరం లేదు. మా అమ్మ అందరినీ ఒకేలా చూసేది. అదొక రకమైన అభిమానంతో వారు అలా చేసేవారేమో.

                  మా నాన్న గారు రెండు మూడు స్కూళ్ళు నడిపే వారు. గవర్నమెంటు గ్రాంటు వచ్చేది. సాయి నగరులో ఉన్న ఒక స్కూలుని " కేశవయ్య స్కూలు " అని అందరూ పిలిచే వాళ్ళు. అందులో ఆడవాళ్ళకు మాత్రమే టీచరు ఉద్యోగాలిచ్చి మా నాన్న వారిని ప్రోత్సహించేవారు . అప్పట్లో అలా ఆడవారు మాత్రమే టీచర్లుగా ఉన్న పాఠశాలలు మా ప్రాంతం లో ఉండేవి కావు .   రెండు పొడుగాటి గుడిసెలే ఆ స్కూళ్ళు. పిల్లలు ఆడుకోడానికీ, ప్రేయర్ చేయడానికీ తగినంత స్థలం ఉండేది. పాతవూరు లో ఉన్న ఇంకో దాన్ని " శ్రీ భారతి విద్యానికేతన్ " అని పిలిచే వాళ్ళు. టీచర్లు మా అమ్మ అంటే ఎందుకనో మరి, ఎంతో భక్తి చూపే వారు. అదేదో, మా నాన్న కింద పనిచేసే వాళ్ళు కాబట్టి అలా ప్రవర్తించేవారనుకుంటే పొరపాటు. మా అమ్మా వాళ్ళతో ఏనాడూ అధికారంగా మాట్లాడ లేదు.
                    1960--65 లలో అనుకుంటాను , మా ఇంటి దగ్గర్లో లక్ష్మి దేవమ్మ, సాలమ్మ అని ఇద్దరు అక్కాచెళ్ళెల్లుండే వారు. వాళ్ళు ఇద్దరూ మా నాన్న గారి స్కూల్లో చదివి , తర్వాత అక్కడే పనిచేసేవారు. తరువాత కాలంలో లక్ష్మి దేవమ్మ  A.P  గవర్నమెంటులో పంచాయతి రాజ్ మినిస్టరయ్యింది.

వాళ్లకి మా అమ్మంటే ఎంత ఆరాధనా భావమంటే, ఏ పండగ వచ్చినా ఇద్దరూ వచ్చి, ఏదైనా కానుక ఇచ్చి, పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకొనే వారు. " ఎందుకమ్మా ఇదంతా ? "  అంటే, ’ పండగ పూట దేవతను పూజిస్తే మాకే మంచిది కదమ్మా ! " అనే వాళ్ళు. అదేమి చిత్రమో., మా అమ్మ ఎవరినీ కొట్టడం గానీ తిట్టడం గానీ కనీసం గద్దించడం గానీచేయక పోయినా, మేమందరం టైముకు మా పనులు పూర్తి చేసుకొని, బుద్ధిగా వుండే వాళ్ళం. ఆర్థికంగా ఎన్ని కష్టాలున్నా, మాకు తెలిసేది కాదు. అలాగని, ఏదో అప్పులు చేసి మాకు అన్నీ అమర్చేదని కాదు. ఏమీ లేకున్నా, అది మాకు అర్థం కానివ్వకుండా మమ్మల్ని సమిష్టిగా వుంచి, ఒక తాటిపై నిలిపేది. కాలం తెలీకుండా ఆనందంగా నవ్వుతూ వుండేవాళ్లం. దేవుడి దయ వల్ల ఆ రోజుల్లో విద్య పూర్తిగా ఫ్రీ గా సాగేది. మాలో కొందరికి స్కాలర్షిప్పులు వచ్చేవి కూడా!.

Wednesday, October 10, 2012

మహాలయ పితృ పక్షము- పితృ తర్పణము--బ్రహ్మ యజనము


¥¹ñlµè¶¢ÀÀvÀ , »phµÅ lɶ¢hµv ¶pÁ¹Y , hµ±µêg¸lµÀv SµÀ±¼AW CÊmOµ ¶ªAlɶ¬¶¢ÀÀvÀ CÊmOµÀvOµÀ hµvÇhµÀåhµÀm¸é±ÀÀ . VµnqÒ±ÀÀ¶m¢¸±¼Oº F ¶pÁ¹YvÀ , ¥¹ñl¸èvÉ£Àdº ? ¢¸±¼ÈmAlµÀOµÀ ¶pÁ¹ZAV¸w ? D¶pÁ¹YvÀ ¢¸±¼OÇv¹ CAlµÀh¸±ÀÀ ? lɶ¢hµvv¹S¸ ¢¸±¼Oº ¶¢±¸wVÉÛ ¶¥Oºå GAdÀAl¸ ? ¢¸±µÀOµÃf¸ LOµ¶pÁýêfµÀ ¶¢À¶mv¹Adº ¶¢À¶mÀ¶¨ÀvÉS¸ ? F ¶pÁ¹YvÀ VɱÀµÀOµqÒhÉ ¶m¶¨àÊ¢À£Àdº ? Ev¹Adº ¶pñ¶¥évhÐ V¸v¹¶¢ÀAl¼ C±ÀÇö¢À±ÀµÃnOº SµÀ±¼ ±ÀµÀ¶¢ÁhµÀm¸é±µÀ .O¸v¶¢ÀÀ SµfºVÉOÍl¿ç , ¶¢À¶m «¸A¶pñl¸±ÀµÃvÀ , DV¸±¸v È¢¶mÀOµ C±µæA hÇw±ÀµÀOµ ,       C¶ªvÀ ¶¢À¶m «¸A¶pñl¸±ÀµÃvÉ hÇw±ÀµÀOµ , ¤dºn n±¸Oµ±¼AVÉ ¢¸±¼ ¶ªAPï IOµÀÖ¶¢¶¢ÁhµÀ¶mél¼ . 

¤dºn SµÀ±¼AW hÇw±ÀµÀVÇÊpꢸ±µÀ vÉOµqÒ¶¢fµ¶¢ÀÀ , Gm¸é , COµÖfÐ EOµÖfÐ Vµl¼£¶ml¼ , ¢¸±µÀ ¤±µÀ VÇ»pê¶ml¼ £n l¸nOº hµ¶¢À H¶® ¶¥Oºå YÑfºAW ¶¢À«¸v¹vÀ Oµw»p , ¢¸gºYï ¶pñ±ÀÇÃYm¸v OжªA  Wv¶¢vÀ ¶pv¶¢vÀ Cwô ¶ªAlɶ®v¶mÀ j±µÛOµqÒS¸ , EAO¸ OÍhµå ¶ªAlɶ®v¶mÀ ¶ªÅ»¨à¶ªÀåm¸é±µÀ . 

¤dº SµÀ±¼AW¶m ¶ª¶¢ÀSµñËÈ¢À¶m ¶ª¶¢ÃV¸±µA ¶¢À¶mOµÀ ££lûµ      ¶pÁ±¸g¸vvѶmà , ¥¹«¸åòvvѶmà ʢlµA vѶmà GAl¼ .    
 CÊ¢ ¶¢À¶mOµÀ ¶pñ¶¢Ãg¶¢ÀÀ . D £¶¨±ÀµÃv¶mÀ CÊmOµ sÀÀ¶¨ÀvÀ £¶¢±¼AW ±ÀµÀÀm¸é±µÀ . O¸sdºà ¥¹«¸åòvvÑ J£À VÇ»pêGm¸é±µÀ , Iv¹ VÇ»pêGm¸é±µÀ CÊm £¶¨±ÀµÃné ¶p±¼§wʪå CÊmOµ D¶ªOºåOµ±µËÈ¢À¶m £¶¨±ÀµÃvÀ È¢vÀSµÀvÑOº ¶¢«¸å±ÀÀ . 
nY¹nOº F £¶¨±ÀµÃvËÈp ¶ª¶¢ÃV¸±µ¶¢ÀÀ V¸v¹ Clû¼Oµ¶¢ÀÀS¸ నే vsûµï¶¢À¶¢ÁhµÀ¶mél¼ . G¶m颸dºvÑ £¶¨±ÀµÃné ¶ª±¼S¸Ø C¶mö±ÀÀAVÉ ¶pñ±ÀµÀhµéÊ¢À F ¶pÁ¶ªåOµ¶¢ÀÀ
Sµ±µÀfµ ¶pÁ±¸g¶¢ÀÀ , ¶mAl¼ ¶pÁ±¸g¶¢ÀÀ , Dl¼hµï¶pÁ±¸g¶¢ÀÀ , ¶¢À¶mÀ, lɶ¢v ¶ªîýÅhµÀvÀ ,           Ê¬¶¢Ãl¼ñ ¶¥Åi , ¶¢Àhµùþï , OµÃ±µî ¶pÁ±¸g¸vvÑ OµÃf¸ £Ê¥¶¨ËÈ¢À¶m ¶ª¶¢ÃV¸±µ¶¢ÀÀAl¼ . n±µä±ÀµÀ »ªAlûµÀ¶¢Á OµÃf¸ F £¶¨±ÀµÀ¶¢ÀÀËÈp l¿±µÙËÈ¢À¶m £¶¢±µgv¶mÀ EWÛAl¼ .¤dºvÑn £¶¨±ÀµÃv¶mÀ OÐñf½Oµ±¼AW ËÈp ¶pñ¶¥évOµÀ ¶ª¶¢Ãlû¸¶m¶¢ÀÀ hÇVµÀÛOÍn CAlµ±¼O½ C±µæ¶¢ÀSµÀ¶mdÀô ¤ËvǶmAhµ OµÀô¶p嶢ÀÀS¸ పై పుస్తకములో  qÏAlµÀ ¶p±µWm¸¶¢ÀÀ 

»phµÅ lɶ¢hµvAdÉ ఎవరు ? °µÀlµñ lɶ¢hµలా ?

    ¤±¼Oº ¥¹ñl¸èlµÀvÀ VÉÊªå ¶pûvÊ¢À£Àdº ? ¥¹ñlµè¶¢ÀÀ / hµ±µêg¸lµÀvÀ  VɱÀµÀOµÀAdÉ »phµÅ  lɶ¢hµvÀ Oлp«¸å±¸ ?
  పితృ దోషము మనుషుల  Y¹hµOµ¶¢ÀÀvÑ ఉంటుందా ?
 »phµÅ lɶ¢hµv Oµ±µî ¶pûv¹né ¶¢À¶mÈ¢ÀAlµÀOµÀ j±µÀÛOж¢vǶmÀ ?  
 మహాలయ పితృ పక్షము అంటే ఏమిటి ?  ఆ పక్షములో ప్రతిరోజూ శ్రాద్ధాదులు చేయవలెనా ? ఏయే రోజుల శ్రాద్ధాలకు ఏయే ఫలములు ? 
శ్రాద్ధాలు క్లుప్తముగా చేయు పద్దతి ఏమిటి ? 

ఇవి , మరియు ఎన్నో ప్రశ్నలకు శాస్త్రీయముగా చెప్పబడిన సమాధానములు పై పుస్తకములో కలవు . 


¥¹ñlµè¶¢ÀÀvÀ ¶¢ÃnÊ¢»ª¶m ¢¸±¼ ±ÀÀAd «¸lû¸±µg¶¢ÀÀS¸ VµÃVµÀ £¶¨±ÀµÀ¶¢ÀÀvÀ

* j¶¢ñËÈ¢À¶m ¶pñ¶¢Ãlµ¶¢ÀÀvÀ
* ¶¢ÀhµÀå ¶¢ÃlµOµ lµñ¢¸ïvOµÀ s¹n¶ªvÀS¸ GAfµÀd / £¶p±¿hµËÈ¢À¶m ¶pñ¶¢±µå¶m
* j¶¢ñËÈ¢À¶m Cm¸±ÐS¸ïvÀ
* Cv¹ê±ÀµÀÀ¶¨À / DOµ»ªîOµ ¶¢À±µg¸vÀ
* lûµ¶m¶¢ÀÀ SµÀ±¼AW¶m £¶p±¿hµËÈ¢À¶m DvÑVµ¶mvÀ / Clû¼Oµ¶¢ÀÀS¸ lûµm¸±µÝ¶m VÉ»ª ¶ª¶¢À¶ªïvÀ hÇVµÀÛOͶmÀd
* sû¹±¸ïsûµ±µåv ¶¢Àlûµï IfµhÇSµn Oµv¶®vÀ , C¥¹Ai
* ¶¢Ã¶m»ªOµ WAhµ , ¶¢Ã¶m»ªOµ ±ÐS¸vÀ
* »¬A«¸hµîOµËÈ¢À¶m ¶pñ¶¢Åiå

¥¹ñlµè hµ±µêg¸lµÀvÀ VɱÀµÀÀd ¶¢v¶m
*  »phµÅ lɶ¢hµv¶mÀ , ¶pÁ¹±¿öOµÀv¶mÀ ¥¹¶p¶¢ÀÀv¶mÀAf½ /
 ¶ª¶¢À¶ªïv¶mÀAf½ £¶¢ÀÀOµÀåv¶mÀ VɱÀµÀ¶¢VµÀÛ
*  ¥¹Ai , «Õsû¹Sµï¶¢ÀÀ , W±¸±ÀµÀÀ¶¢Áv¶mÀ qÏAlµ¶¢VµÀÛ
*  ulµ±¼Oµ¶¢ÀÀ , Cm¸±ÐSµï¶¢ÀÀ , ¶ªAsAlûµ s¹Alûµ¢¸ïvvÑ  
¶¢ÀAW ¶¢Ã±µÀêvÀ   OµvÀSµÀh¸±ÀÀ

F O¸v¶¢ÀÀ hÇvÀSµÀ ¢¸±µÀ lɶ¥lɶ¥¶¢ÀÀvAlµÀ n¶¢¦AVµÀVµÀm¸é±µÀ . ¢¸±¼Oº F O¸±µï¶¢ÀÀvÀ VɱÀÀAVµÀ s¹ñ¶¬îgÀfµÀ lͱµOµÀd Oµ¶¨à¶¢ÀÀ .  ¶ªölɶ¥¶¢ÀÀvÑ OµÃf¸ CÊmOµÀvÀ F ¶ª¶¢À¶ªï¶mÀ IlµÀ±ÍÖAdÀm¸é±µÀ . O¸sdºà ¶pñil¸nO½ LOµ±¼ËÈp Dlû¸±µ¶pfµOµÀAf¸ ¤ËvǶmAhµ ¶¢±µOµÃ I¶¢±¼Oº ¢¸±µÀ OÍAhµ Êm±µÀÛOÍn EAdºvÑÊm h¸Ê¢À VɶªÀOͶmÀd LOµ ¶pñh¸ï¶¢Ãé±ÀµÀ¶¢ÀÀ ¶¢ÃhµñÊ¢À . 

F ¶pÁ¶ªåOµ¶¢ÀÀ¶mÀ¶p±ÀÇÃS¼AW I¶¢±¼Oº¢¸±É SµÅ¶¬¶¢ÀAlµÀ hµ±µêg¶¢ÀÀvÀ , sñ¶¬î±ÀµÀY߶¢ÀÀ ¶¢Adº O¸±µï¶¢ÀÀvÀ VɶªÀOͶm¶వచ్చును  C£ VɱÀµÀ¶¢v»ª¶m ±ÐY ¶¢ÃhµñÊ¢À O¸Oµ ,¶¢ÀÀAlµÀS¸ LOµdºOº ±ÇAfµÀ «¸±µÀô Vµl¼£¶m , sÑlûµ¶pfµÀ¶mÀ .
    È¢ÀÀlµdÑô hµ¶pÁýêvÀ Y±µSµ¶¢VµÀÛ¶mÀ. O¸o ¶¥ñlµè ¶¢ÀÀPﶢÀÀ . ¶¢À¶m hµ¶pÁýêv¶mÀ »phµÅlɶ¢hµvÀ I¶pêdºOµ¶pÁýêfµÀ JlÐ LOµ £lûµAS¸ hÇw±ÀµÀYɱÀµÀÀVµÀAlµÀ±µÀ . El¼ D±ÀµÃ Oµ±µîvÀ VɱÀµÀÀ¢¸±µAlµ±¼O½ JlÐ LOµ £lûµAS¸ C¶mÀsûµ¶¢¶¢ÀÀvÑOº ¶¢VµÀÛ¶mlÉ . ఇవికాక , sñ¶¬î ±ÀµÀY߶¢ÀÀ CAdÉ J£Àdº ? sñ¶¬î ±ÀµÀY߶¢ÀÀ చేయు  £lû¸¶m¶¢ÀÀ ఏమిటి ? చేస్తే ఫలితమేమిటి ? అను విషయములు  కూడా వివరించబడినవి . 

ఈ  విషయము శాస్త్ర ప్రమాణమైనది  అయితే ఎవరి నమ్మకాలు వారివి . ఇవి మసి పూసి మారేడు కాయ చేసే రోజులు కావు . కాబట్టి ఆసక్తి ఉన్నవారికి మాత్రమే ఈ  పుస్తకము ఇవ్వదలచినాము . అందుకే దీనిని డౌన్ లోడ్ చేసుకొనుటకు లింకు ఇవ్వడము లేదు . 

పిడిఎఫ్  పుస్తకము కావలసిన వారు కింది మెయిల్ ఐడి కి రాయగలరు


 సమయజ్ఞ సామాజిక సభా ట్రస్ట్  కార్య క్రమాలు నిరంతరం నిరాఘాటముగా సాగాలంటే మీ వంటి సహృదయుల నుండి అన్ని రకాలైన సహకారాలూ అవసరము . దయచేసి అందరూ యథా శక్తిగా విరాళాలు ఇవ్వవలసినదిగా ప్రార్థన.  విరాళము ఎంత అన్నది ప్రధానము కాదు . మీకు తోచిన ఎంత మొత్తా న్నైనా పంపవచ్చును . పంపవలసిన అకౌంటు వివరాలు 

DETAILS OF BANK ACCOUNT

Name: B.Janardhana Rao

Address : # 47 , 2nd Floor , 2nd Main , PP Layout ,
Banasankari 3rd Stage , Bangalore 560085
A/c Number 6405 9935 532
State Bank of Mysore ,
Bank Code : SBM Colony Branch - IFSC :  SBMY0040575

janardhan36@gmail.com
samayajna@gmail.com

+91 9902 719 702




Friday, October 5, 2012

2. " జీవిత చుక్కాని " రెండవ అంకము


రెండవ అంకం ( మా నాన్న గారి పరిచయం ) 


           అనంతపురం లో తాడిపత్రి మండలంలో చిన్న పప్పూరు అనే పల్లెటూరు ఉంది. అక్కడికి దగ్గర్లో " అశ్వథ్థం "  అనే ఊర్లో భాస్కర శేషయ్య గారని  జమీందారు లతో తూగగల ఒక భూస్వామి  ఉండే వారు. వారే మా తాత గారు. అప్పటికి ఆయన ’ గార్లదిన్నె శేషయ్య ’ గా పిలవబడే వారట. ’  వారి సొంత ఊరు నిజానికి  గార్ల దిన్నె . అదీ అనంతపురం జిల్లాలోనే ఉంది. ఆ కాలంలో ఆయన చాలా ధనికుల్లో ఒకరు.  . ఆయన తండ్రి గారు, శ్రీ సుబ్బయ్య గారు. వారికి తండ్రి గారు శ్రీ అయ్యంభొట్లు గారు. అప్పటివరకూ భాస్కరభొట్ల అని ఉన్న మా ఇంటిపేరు ఏ కారణం చేతనో  మాతాతగారి కాలంలో ’ భాస్కర ’ గా మిగిలిపోయింది. అశ్వత్థం లో మాతాతగారు  కట్టించిన శివాలయం ఇప్పటికీ ఉంది . 

          1902  నుండి 1912  మధ్య కాలంలో ఇండియాలో, ముఖ్యంగా, దక్షిణ దేశంలో ’ ప్లేగు ’ వ్యాధి ప్రబలి, ఊళ్ళకు ఊళ్ళే తుడిచి పెట్టుకు పోయాయని, పాత తరం వారు ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంటారు. లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందులో మా నాన్నమ్మ, తాతయ్యలు కూడా ఉన్నారు. మొదట మా నాన్నకు  5 --6   ఏళ్ళ వయసులో వాళ్ళమ్మ పోయింది.  మా తాతయ్యే ( శ్రీ శేషయ్య ) అన్నీ అయి మా నాన్నని పెంచారట. మా నాన్నకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. తాతయ్య మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. . ఆయనకి చాలా ఓపిక, సహనం ఎక్కువని మా నాన్న చెప్పే వారు. ఆయనకి నియమ నిష్టలు ఎక్కువ. శ్రీ విద్యా ఉపాసకులు , ఆయనే ఇంట్లో వంట చేసే వారట,  త్రికాల సంధ్యలు, ఔపోసనలు, త్రికాలాగ్నిహోత్రాలతో ఇంట్లో శ్రోత్రియ వాతావరణము ఉండేది. వేద ఘోషలతో వచ్చీ పోయే అభ్యాగతులతో సందడిగా ఉండేది. మా తాతగారి ఇంటి ఈ వివరాలను , మా నాన్న చెప్పిన ఇతర విషయాలు , మాతాతగారి నేపథ్యం , మా నాన్న మరియు మా చిన్నాన్నల  వైదీక కర్మల ఆసక్తి మరియు ఆచరణ వంటి విషయాలు ప్రామాణికంగా తెలుపుతున్నాయి . ముఖ్యంగా , మా తాతగారు రెండుసార్లు కలలో కనిపించిన వైనం కూడా వీటికి ఆధారంగా నిలుస్తున్నది .  నాన్న చెప్పలేదు గానీ, మా తాతయ్య బహుశః పౌరోహిత్యం  చేసేవారో లేక టీచరుగానో ఉండేవారనుకొంటాను. మా నాన్నపేరు శ్రీ  కేశవయ్య. , ఆయన తమ్ముడి పేరు ,  శ్రీ మృత్యుంజయ శాస్త్రి. తాతయ్య,  కొడుకులిద్దరిని కష్టపడి పెంచారట. ఐతే, మా నాన్నకి  9 -  10  ఏళ్ళకే, మా తాతయ్య గారు కూడా పోయారట. అదృష్టమో, దైవసంకల్పమో, మా నాన్నా, చిన్నాన్నా వ్యాధి బారిన పడలేదు. అప్పటికే, వీరి ఆస్థిని ఎవరికి అందింది వారు దోచేశారట. కొందరు నకిలీ పత్రాలు సృష్టించి, ఆస్థిలో సింహభాగం కాజేశారట. పోయింది పోగా, మిగిలింది కూడా తక్కువేమీ కాదట. వీళ్ళ పేరుతో ఇంకా కొంత ఆస్థి ఉండేదట. 

          అది తెలిసి, ఒకామె, "  మీ చిన్నాన్న భార్యను, నీకు పిన్నమ్మను,  నిన్ను పెంచుకుంటాను " అని చెప్పి, మా నాన్నని బళ్ళారి కి తీసుకొని పోయిందట. వెళ్ళాక, రెండు రోజులకే, చెంబు చేతికిచ్చి, బియ్యం ముష్టి ఎత్తుకుని రమ్మని పంపించిందట. చెంబుకి నామాలు పెట్టి, పిల్ల వాణ్ణి పంచెకట్టీ పంపేదట. మా నాన్న అమాయకంగా అలాగే ఒక   పది పదిహేను రోజులు   చేశాడట. అంతలో, " ఎర్ర సీతమ్మ " అనే ఒకామె, ’  నీ మేనమామ కూతురిని ’ అని చెప్పి పిలుచుకు పోవడానికి వచ్చిందట. తరువాత, మా నాన్న గుడిలో కూర్చొని ఎందుకిలా అందరూ నన్ను మోసం చేస్తున్నారు అని  జరిగిందానికి బాధ పడుతుండగా, పక్క పల్లె నుంచి వచ్చిన ఒకాయన , ’ ఈ పిల్లాడినెక్కడో చూశానే ’  అనుకొని,  వివరాలు తెలిసికొని,

           "  అయ్యో, నీవు గార్లదిన్నె శేషయ్య కొడుకువా "  అని కళ్ళ నీళ్ళు పెట్టుకొని,  బాధ పడి, తనతో  తీసుకెళ్ళారట. ఆ పుణ్య దంపతులే , వీరికి తల్లీ, తండ్రీ అయి పెంచారట. ఆ సమయంలో,మా నాన్న గారి మేనమామ గారయిన తూముచెర్ల రామకృష్ణయ్య గారు,  వీరి పేరుతో ఇంకా భూములున్నాయని విని, తూముచెర్లకు పిలిపించారు. "  మీ అత్తా, నేను .....,ఇద్దరమే కదా, నాకు తోడుండండి. నా ఆస్థి నా తర్వాత  మీకే " అని చెప్పి దగ్గర ఉండమన్నారు. వచ్చాక, ఎనుములు ( గేదెలు ) కాచేందుకు పురమాయించాడు. అప్పుడు, హట్టి శంకర రావు గారని ఒక బంధువులాయన, వచ్చి, యోగ క్షేమాలు  విచారించి, " మా ధర్మవరానికి రా, నీకు   SSLC వరకు చెప్పించి, పంచాయతి స్కూల్లో టీచర్ ఉద్యోగం ఇప్పిస్తాను " అని చెప్పి, ఆయనే చార్జీలు పెట్టుకుని, పిలుచుకుని వెళ్ళి, స్కూల్లో టీచర్ గా చేర్పించారు. మా పిన్నప్ప  ( మా చిన్నాన్నని మేము పిన్నప్ప అని పిలిచే వాళ్ళం ) మాత్రం, మేనమామగారింట్లోనే ఉండి, తర్వాత పౌరోహిత్యం  నేర్చుకున్నారు.


          సరే, టీచర్ గా ట్రైనింగ్ అయి, 3 నెలలు గడచినా జీతం రాకపోయేసరికి, వెళ్ళి అడిగారట. తాసీల్దారు గారి ద్వారా , పిల్లవాడి పనితీరు గురించి విచారించి, నమ్మకం కుదిరాక, జీతం ఇచ్చారట. మా నాన్న మొదటి జీతం, 8  రూపాయలట. ట్యూషన్ లు చెప్పి ఇంకో 7  -  8  రూపాయలు సంపాదించే వారట.  మా నాన్న శ్రద్ధ, పని తీరు నచ్చి,  తాసిల్దారు గారు హోటల్ వాడికి చెప్పి, మా నాన్న దగ్గర డబ్బులు తీసుకో వద్దని చెప్పినారట. ఆయనే ఇచ్చే వారట.  మాటల్లో, మా నాన్న విషయాలు అడిగి, తోపుదుర్తి లో బంధువులున్నారని, ములకనాటి వాడని తెలుసుకున్నాడట.

          ఆ తాసిల్దారు గారి దగ్గర డెప్యూటీ తాసిల్దారుగా వున్న శ్రీ సీతారామరావు గారే, నేను మొదట పరిచయం చేసిన మా అమ్మ మేనమామ గారు. 

          మా అమ్మంటే వాళ్ళ మేనమామ  సీతా రామయ్య గారికి చాలా అభిమానము. అసలు ఆయన మా అమ్మను పెంచుకుందామనుకున్నారట.  మా నాన్నను చూసి, పిల్లవాడు బుద్ధిమంతుడి లాగా ఉన్నాడు, పద్మావతి కి సరియైనవాడు అని చెప్పి, మా తాతయ్య నీలకంఠరావు గారినీ, అమ్మ అన్నయ్య సదానంద ని పిలిపించారు.

          " కాదయ్యా,  నేనే ఒక పనికిమాలిన వాణ్ణి , ఎన్నో సంవత్సరాలు   వృథా అయిపోయాయి ,  ఉద్యోగం కూడ ఖాయం  కాలేదు, ఇంకా SSLC   ఫలితాలు   రాలేదు, నాకు పెళ్ళి అప్పుడే ఎందుకు " అని మా నాన్న అడ్డు చెప్పితే, వాళ్ళు వినక, ఉద్యోగం ఖాయం చేయిస్తాము, ఒప్పుకో, అన్నారు. తప్పుతాననుకున్న లెక్కల పేపర్లో సరిగ్గా 36 మార్కులు రావడం తో, ఒప్పుకోక తప్పలేదు.  ఐతే, మా నాన్నకి, పుట్టిన తేదీ గానీ, జాతకం గానీ తెలియదు. పుట్టింది కూడా 1906 లోనో, 1908  లోనో అనేవాడు. ఆయనకున్న షరతు ఒక్కటే. అమ్మాయికి సుమంగళి యోగం ఉండాలి, అల్పాయుష్కురాలు కాకూడదు. మా అమ్మ జాతకంలో ఆ రెండూ సరిపోయాయి. కాని అమ్మది అత్త లేని నక్షత్రం ( ఆశ్లేష ).  మా నాన్నమ్మ అప్పటికే కాలం చేసి ఉండటంతో, ’ సరే ’ అన్నాడు.  

          అప్పటికి మా నాన్నకు 21  సంవత్సరాలు ఉండచ్చు . పెళ్ళయ్యాక, తాడిపత్రి కి  ట్రాన్స్ఫర్ అడిగి వేయించుకున్నాడు. అక్కడి సబ్-తాసిల్దారు గారింట్లో రూము తీసుకుని ఒక రెండేళ్ళు ఒక్కడే ఉండే వాడు. పెళ్ళయాక కూడా ఒక్కడే ఉండటానికి ఓ కారణముంది . ఆ కారణానికీ  మా అమ్మకు  ఏ సంబంధం లేకపోయినా ఆమె జీవితంలో పెనుతుఫానులు వచ్చాయి . 

          ఆ సబ్-తాసిల్దారు గారింట్లో ఎక్కువ రోజులు భోజనం చేస్తే బాగుండదని, వేరే వంట చేసుకొనేవాడు. అది చూసి, ఆ సబ్-తాసిల్దారు గారి భార్య రామ లక్ష్మమ్మ  వచ్చి, పొయ్యిలో నీళ్ళు పోసేసేది. ’ పెళ్ళాం వచ్చి, ఇద్దరు పిల్లలయ్యే వరకు మా ఇంట్లోనే భోజనం ’ అని ఆర్డరు వేసేసింది. ఆమెను మా నాన్న ’ అక్కా ’ అని పిలిచే వాడు.   మేము ఆమెని మా నాన్న సొంత అక్క అనుకునే వాళ్ళం. ఎందుకంటే, ఎప్పుడూ, ’ మా అక్క  ’ అనే ప్రస్తావించే వాడే కాని, అసలు విషయం ఎప్పుడూ చెప్పలేదు. ఒకసారి, మా అమ్మ పోయాక 5 -- 6  ఏళ్ళకు, తన జీవిత చరిత్ర మొత్తం చెప్పితే, మా పెద్దక్కయ్య దాన్నంతా రికార్డు చేసుకుంది.

          తరువాత, ’ గుత్తి ’ లో ఉన్న భూమా రెడ్డి అనే ఆసామి, వచ్చి, ఎలాగున్నావయ్యా? అని అడిగాడట. ఆయన మా నాన్నకి ముందే పరిచయం. ఆయనతో, ’ వీళ్ళు నన్ను వంట చేసుకోనివ్వడం లేదు, గుత్తి కి ట్రాన్స్ ఫర్ చేయించండి ’ అని అడిగి, గుత్తి కి బదిలీ అయ్యాడు.

         తరువాతి కాలంలో  అనంతపురంలో కమలా నగరులో మా నాన్న దగ్గరుండి ఇల్లు కట్టించుకున్నాడు. అప్పుడు మా నాన్న, చిన్నాన్న, వారి మేన మామ అందరూ కలసి సమిష్టిగా ఆ ఇంట్లోనే ఉండేవారు. 

          ఆ తరువాత, ఆస్థులు పంచుకుని, మా నాన్న సాయినగరులో విశాలమైన స్థలంలో చిన్న ఇల్లు కట్టుకున్నాడు. మా చిన్నాన్న  వారి కుటుంబం ఇప్పటికీ కమలానగరు లోని ఇంట్లోనే ఉన్నారు. 

          అప్పటికి మా నాన్నకు మిగిలిన ఆస్థి చాలా తక్కువ. చిన్న వయసులోనే, అనాథ కావడము, ఆస్థి చేతికి రావడముతో, ఉక్కిరి బిక్కిరై, మార్గ దర్శనము లేక, వృథా ఖర్చులు చేసి , అంతా పోగొట్టుకున్నాడు. మేనమామ కూడా అన్యాయం చేశాడని, తమ్ముడితో కలిసి, తనకు రావలసింది రాకుండా చేశాడనీ చెప్పేవాడు. నా చిన్నప్పుడు, ఆ విషయాల గురించి ఘర్షణలు జరగడం నాకింకా గుర్తే.

          అయితే, మా తరం వాళ్ళకి, అది మాత్రం మాకు చెందని ఆస్థి. వాటివివరాలు గానీ, హక్కుల గురించి గానీ, మా నాన్న మాకు ఏనాడూ చెప్పలేదు. వాటి గురించి మాకు ఆలోచనలు గానీ, ఆశ గానీ ఏ మాత్రం ఉండేవి కావు. ఒక వేళ ఏమైనా సెటిల్మెంటు అయి ఉండిందో కూడా మాకు తెలీదు.. అప్పటికి మేము బాగా చిన్న పిల్లలము.

          మా చిన్నాన్న మా నాన్నతో పోలిస్తే మృదుభాషి. మనిషి మంచి నిదానస్తుడు. ఆ ఆస్థి గొడవలు రాకుండా వుంటే వారి కుటుంబముతో మాకు అనుబంధము బాగానే ఉండేది. అన్నదమ్ములు విడిపోయాక, కొంతకాలము రాకపోకలుండేవి. తరువాత తగ్గిపోయాయి. పిల్లలము మేము వెళ్ళి వచ్చే వాళ్ళము. తరువాత అదీ తగ్గిపోయింది. కనీసం శుభకార్యాలకు, తద్దినాలకు కూడా కలవడం లేదు. ఎపుడైనా సినిమా హాళ్ళలోనో మార్కెట్టులోనో  కనిపిస్తే మాట్లాడే వాళ్ళం. మా బంధాలు తగ్గిపోయాక మా చిన్నాన్నకి కలిగిన సంతానముతో మాకు పరిచయము కూడా లేదు. 

Tuesday, October 2, 2012

1. " జీవిత చుక్కాని " ఒకటవ అంకము


                         ఒకటవ అంకము                          

          ఈ అంకంలో అమ్మ తో పరిచయం ,  పుట్టింటి సంగతులు , చిన్నప్పటి విశేషాలు , పెళ్ళికి ముందు ముచ్చట్లు చూడచ్చు.

                      మా అమ్మ తాను చనిపోయిన దాదాపు 25 సంవత్సరాలకు మళ్ళీ అందరి మనసుల్లోకి ఒక కొత్త జ్ఞాపకం లాగా రావాలనుకుందేమో మరి, పాత విషయాలు  ( విన్నవీ, కన్నవీ, ) తెరలు తెరలుగా కళ్ళముందుకొస్తున్నాయి.
వింతేమంటే, ఎంత గుర్తుతెచ్చుకుందామన్నా మా అమ్మ సుందర ప్రశాంత వదనం కనిపిస్తుందే తప్ప అంత ప్రశాంతంగా ఉండడానికి ఆమె సుఖాలు అనుభవించింది ఎప్పుడో ఒక్కటీ జ్ఞాపకం రాదు.  కష్టాల్లో కూడా పిల్లల సంతోషమే ఆమె సంతోషంగా కనిపించేది. ఐతే, తనకంటూ ప్రత్యేకంగా కోరికలు, సరదాలు లేవా?  తన బ్రతుకు ఎలా గడిచింది ? చిన్నప్పుడు  10, 15  సంవత్సరాల వరకు చాలా సంతోషంగా గడిపిందని విన్నానే ? సరే, అది తెలియాలంటే, మనం 1918 వ సంవత్సరంలోకి వెళ్ళాలి

          ఆరుగురు అన్నదమ్ములు,  ఒక అక్క, ఒక చెల్లెలు, మురిపెంగా చూసుకొనే తల్లి, నెత్తిన పెట్టుకొనే తండ్రి, వీళ్ళంతా కలిసి చేసే హంగామా అంతా ఇంతా కాదు. అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా లో శ్రీధర ఘట్ట  అనే చిన్న పల్లెటూళ్ళో మా తాతయ్య ఊరి కరణం గా  మంచి ఉద్యోగమే చేసేవారు. దేనికీ కొదవ లేదు. ఆడింది ఆట, పాడింది పాట లాగా ఉండేది. అదంతా మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది.  సరిగ్గా ఐదారేళ్ళు కూడా లేని వయసులో అన్న సదానంద రావు తో కలసి బళ్ళారి లో తిరుణాళ్ళ కని వెళ్ళింది. బళ్ళారి ఆ కాలంలో సంయుక్త ఆంధ్ర దేశం లో భాగం గా ఉండేది.  అప్పుడు జరిగిందాని పర్యవసానం ఇంకోలా ఉండుంటే ఇదంతా జరిగేది కాదు, అసలు మా కుటుంబమే ఉండేది కాదేమో. తిరుణాళ్ళలో వింతలు చూస్తూ చిన్నారి పద్మావతి ( అదే, మా అమ్మ పేరు ) తప్పిపోయింది.  ’ అన్న ’ ..... ’ అన్న ’ ...  అంటూ, ఏడుస్తూ అటూ ఇటూ వెతుకుతూ తిరుగుతోందట. కన్నడ భాషలో ’ అన్న ’  అంటే  మన " అన్నం " అన్నమాట. చూసినవాళ్ళు ’ అయ్యో పాపం ’ అంటూ, ఆకలైందేమో అని, తినడానికి ఏవేవో ఇవ్వజూపారట. అదృష్టవశాత్తూ, సదానంద ఇట్టే వచ్చి, చెల్లెల్ని కనుక్కొని, ఎత్తుకొని వెళ్ళాడు.

          అమ్మకు అదెంత గుర్తో కానీ , మా చిన్నపుడు " బొట్టుకు రెండు ద్రాక్షా పళ్ళు బళ్ళారి సంతలో కొనుక్కోండి " అని పాడేది . బొట్టు అంటే ఒకటిన్నర పైసా.  మాకు ఆ కాలములో ప్రతిదానికీ బళ్ళారితో ముడిపడిన ఏదో ఒకటి చెప్పేది . 

       అలా ఆ  గండం గడచి, మళ్ళీ మామూలుగా ఆటపాటలతో ఓ ఐదారేళ్ళు సంతోషంగా ఉండగా, అదిగో, ఆ మాయదారి పిల్లవాడు , బంధువుల పిల్లాడేనట , ఏదో పెళ్ళిలో  వచ్చి, మా అమ్మమ్మ  కృష్ణవేణమ్మ చేతిని కొరికాడట. మొదట ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అది సెప్టిక్ అయ్యి, ప్రాణాంతకమై, చివరికి మనిషే పోయింది. అలా పది పదకొండేళ్ళ లోనే తల్లిని పోగొట్టుకున్న మా అమ్మను, మా తాతయ్యే అన్నీ తనే అయి చూసుకున్నాడు.

          తండ్రికి ముద్దుల కూతురు   తోటే లోకం. ఆయన లాగే ఆయన రాసిన పాటలు శ్రావ్యం గా  పాడేది కదా మరి ! ఆయన పూజకి దేవుడి గది శ్రద్ధగా  ఆవుపేడతో అలికి ,ముగ్గులు పెట్టేది.  పూలు, పాలు , దీపాలు, , అన్నీ సిద్ధం చేసేది.  ఆయన తొడపై కూచొని తనకు వచ్చిన శ్లోకాలు, పద్యాలు చెప్పేది. భోజనం ఆయన ముద్దలు చేసి తినిపిస్తేనే తినేది.  ఎపుడు చూసినా ఆయన ఒళ్ళోనే ఉండేది. అన్నదమ్ముల మధ్య లేదంటే, తండ్రి ఒళ్ళోనే.  ఎంత మురిపెం ?   ఒకోసారి అన్నదమ్ములు అందరూ తలో వాయిద్యం వాయిస్తూ ఉంటే , తండ్రి కూడా వారితో చేరి కీర్తనలు పాడేవాడు . అప్పుడు కూడా కూతురు వంత పాడనిదే నడవదు !  " ఆ నీలకంఠ రావు కి పద్మావతి ఒక్కత్తే కూతురా ఏమిటి ? అంత గారాబం ! "  అనుకున్న వాళ్ళు ఉండి ఉంటారు. అయినా గారాబం ఎంత కాలం చేస్తారు? యుక్త వయస్సు  వచ్చేదాకా . ఆ కాలం లో ఆడ పిల్లలకి ’ అష్టా వర్షాద్భవేత్ కన్యా ’ అనే న్యాయాన్ని అనుసరించి , చిన్న వయసులోనే పెళ్ళి చేసేవారు . తల్లిలేని పిల్ల, త్వరగా పెళ్ళి చేస్తేనే మంచిది. అని చెప్పని వాళ్ళుంటారా ? అదీ 1930  ప్రాంతాల్లో !.  ఆమె మేనమామ శ్రీ సీతారామరావు ఆ బాధ్యత నెత్తిన వేసుకున్నాడు.  తన పెద్ద మేనకోడలు రామలక్ష్మి కి కూడా ఆయనే మంచి సంబంధం తెచ్చి పెళ్ళి చేశాడాయె ! కరణం శ్రీ రాములు అని బంధువుల అబ్బాయిని వెదకి, పెళ్ళిచేసి సంతోషించాడు. ఆయనకు కూతుర్లు లేరు. చురుకైన చూపులతో ఎప్పుడూ హుషారుగా ఉండే పద్మావతి అంటే ఆయనకి ఎంతో వాత్సల్యము. ఆయన ఈ కథ జరిగే  కాలంలో అనంతపురం లో డిప్యూటీ తహసీల్దారు గా ఉండేవారు. తరువాతి కాలంలో తాశీల్దారు కూడా అయ్యారు. 

" జీవిత చుక్కాని " పునరాగమించిన పునీత

               

                    పునరాగమించిన పునీత

నేను : మా అమ్మ మళ్ళీ తిరిగి వచ్చింది, తెలుసా ?

మీరు : ఐతే ఏంటట ? వెళ్ళిన వాళ్ళు వస్తారు.

నేను : అలా కాదు, మా అమ్మ తప్పి పోయి మళ్ళీ రాలేదు. అదేదో చిన్నప్పుడు తప్పిపోయి వచ్చింది. అది వేరే సంగతి. మా చనిపోయిన అమ్మ ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చింది.

మీరు : అదే నేనూ అనేది . అది మామూలే.

నేను : ఇంకో జన్మ తీసుకొని రాలేదు. మా అమ్మగానే మళ్ళీ వచ్చింది.

మీరు ; అయ్యా ! అవునయ్యా ! అలాగే వస్తారు. అది మామూలేనని చెప్పాగా ?

నేను : నేను చెప్పింది సరిగ్గా విన్నారా ?

మీరు : నన్ను విసిగించకండి. చనిపోయిన మీ అమ్మ, మీ అమ్మ లాగే తిరిగి వచ్చింది. అంతేగా ? చనిపోయిన వాళ్ళు దాదాపు అందరూ అలాగే తిరిగి వస్తారు. అందులో వింతేముంది ?

నేను : ....? .... ?....

మీరు : కంగారు పడకు. ప్రతి సంవత్సరం శ్రాద్ధం అందుకోవడానికి పోయిన వాళ్ళు రారా? అలాగన్న మాట.

నేను : ఇది అలా కాదండీ ! మా అమ్మ తనంతట తాను రావడం కాదు. మేం పిలిపించుకున్నాం .

మీరు : ఏమిటీ ? పిలిపించుకున్నారా  ? .. అదెలా ? నమ్మమంటావా ? ,...

నేను ( గర్వంగా ) ఐతే వినండి. ( అదే, చదవండి )

" జీవిత చుక్కాని " ముందుమాట


మాతృ దేవో భవ ----------- -------పితృదేవో భవ

                                ముందుమాట

                రోజూ వార్తాపత్రికలు చూస్తే , మరణించిన వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ ఫోటో తో కూడా ప్రకటనలు వుంటాయి. ఆదివారాలు కొంచెం ఎక్కువగా వుంటాయి.  ఎందుకో  తెలీదు . కానీ,  కొన్ని మాత్రం  బడాయికి  పూర్తి పేజి లేదా అరపేజి వుంటాయి. రోజుకు ఒక్క ఆంధ్రప్రదేశ్ నే తీసుకున్నా, వేలమంది చనిపోతూ వుంటారు... పోనీ,.. వందలలో అయినా వుంటారు కదా ! అలా వందల్లోనో, వేలలోనో  పొయ్యే వాళ్ల శ్రద్ధాంజలి ప్రకటనలు వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. ఎందుకలా ? " శ్రద్ధాంజలి " కి నోచుకోని  వాళ్ళు అందుకు అనర్హులా ? వాళ్ళలో ఏ గొప్పదనమూ వుండదా ? లేక ప్రకటనలు ఇవ్వగలిగే స్తోమత లేకనా ? ఆసక్తి లేకనా ? పై కారణాలు అన్నో కొన్నో అయి వుండవచ్చును. ఏ కారణమూ లేకపోవచ్చు కూడా !

          మా అమ్మ చనిపోయినప్పుడు మేము ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు. పైన చెప్పిన ఏ ఒక్క కారణమూ కాదు.   ఎందుకంటే, మా అమ్మ బ్రతికిన  రోజుల్లో ఆమెను ఎంత యధాలాపం గా  పరిగణించామో పోయినప్పుడూ అంతే యధాలాపంగా పరిగణించడం వలన.  అందుకే ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు. ఇలాంటివి రాయొచ్చో లేదో కానీ,   ’ అలాంటివన్నీ మన సంప్రదాయం కాదు ’ అనే అభిప్రాయం ఏ మూలో వుందేమో ! ఆమె పోయేనాటికి ఆమెకు భర్తా,  ఆరుగురు కూతుళ్ళూ,  అల్లుళ్ళూ,  ఐదుగురు కొడుకులూ,  నలుగురు కోడళ్ళూ,  పదహారుగురు మనవలూ,  మనవరాళ్ళూ  వున్నారు. ఎవరికీ ఆ ఆలోచనే రాలేదు. పత్రికలో ప్రకటన ఇస్తే తప్ప ఆ పోయిన వ్యక్తికి పరిపూర్ణత వచ్చినట్టు, గౌరవం ఇచ్చినట్టు  అని చెప్పడం నా ఉద్దేశం కాదు.   పత్రికలో  ప్రకటన ఇచ్చినా, ఇవ్వకున్నా, పోయినవారి గొప్పదనాన్ని మాత్రం మరచి పోకూడదు. 
ఐతే అనూహ్యంగా, మా అమ్మ మరణ వార్త ’ ఆంధ్ర పత్రిక ’ దినపత్రికలో " ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు శ్రీ భాస్కర కేశవయ్య గారికి సతీ వియోగం "  అనే శీర్షికతో  సమాచారంగా వేశారు. 

          మా అమ్మ ఎవరు ? ఆమె గొప్పదనము ఏమిటి ? అంటే నాదగ్గర వెంటనే ఏ సమాధానమూ లేదు . ఆమె చదువు అయిదో తరగతి . పుట్టి పెరిగింది ఒక కుగ్రామములో .. ఆస్తిపాస్తులు అంతంత మాత్రమే . అనాకారి కాకపోయినా అందగత్తె కూడా కాదు . పెద్ద పదవులూ హోదాలూ ఏమీ లేవు . మరి ?  ..... 

           వీటితో సంబంధము లేకుండా ఒక మనిషిలో గొప్పదనము ఉండకూడదా ?  ఉండకూడదో లేదో గానీ , కొంతమందికి ఉంటుంది . ఎలా ఉంటుంది అంటే ఒకమాటలో ఎలా చెప్పగలము ? 

          ఆమె పోయి నేటికి 27 సంవత్సరాలు కావస్తున్నది. ఒకసారి వెనక్కి తిరిగి  చూసుకుంటే  పత్రికలో ని ప్రకటనలు ఆమెకు న్యాయం చేసేవి కావేమో అనిపిస్తున్నది .  ఎందుకంటే ఆమె అతి మామూలుగా పుట్టి, పెరిగి, విలక్షణంగా  బ్రతికి, మామూలుగా చనిపోయిన  అసాధారణమైన వ్యక్తి. అలాంటి వాళ్ళు ఎక్కడో కాని తారసపడరు. ఆమెలోని కొన్ని పార్శ్వాలు కొన్ని సినిమాలలోనూ, నవలలలోనూ ఆయా పాత్రల్లో చూసి వుంటాము కానీ పూర్తిగా ఆమె వ్యక్తిత్వం గూర్చి చెప్పాలంటే  అది నిజంగా సాధ్యం కాదు . 

           కొందరామెను అవదూతలతో పోల్చదగ్గ వ్యక్తి అన్నారు . ఈమె ఉన్న చోట ఇతరులకు సుఖ సంతోషాలు  ఉంటాయి అన్నారు .  అందులోని సత్యం ఆమె పోయాక , ఆ సుఖ సంతోషాలు దూరం అయ్యాక  గానీ మాకు అర్థం కాలేదు. ఆమె ఒక గొప్ప వెలుగులాంటిది. చీకటిని చూస్తేగానీ వెలుగు విలువ తెలీదు. , ఆమె ఉన్నంతకాలం మాకు చీకటి అంటే తెలీదు. అలాగే వెలిగిపోతున్న ఆమె గొప్పదనమూ తెలీదు. 

          అలాంటి ఆమెను గురించి  తెలుసుకోవడం అందరికీ అంతో ఇంతో తప్పక ఉపయోగపడుతుంది అనిపించి కలం పట్టాను . . అది అందరి హక్కు కూడా ! ఎందుకంటే, ఆమె తన జీవితంలో  ఎవరు తారసపడినా , వారికి సంతోషాన్ని పంచి పెట్టింది కానీ, తర తమ భేదాలు చూప లేదు. బ్రతికినప్పుడు ఆమెను కలుసుకోలేదన్న చిన్న కారణం చేత  ఇతరులు ఆమె వలన  ఏ లబ్ధీ పొందరాదు అనే సంకుచితత్వం దేవుడి దయ వలన మాకు రాలేదు.  ఆమెను గురించి చెప్పే ప్రయత్నమే మీ చేతుల్లో వున్న ఈ పుస్తకానికి దారి తీసింది.

          అలాగని ఇదేదో జీవిత చరిత్ర కాదు. కథ అంతకన్నా కాదు. మా అమ్మ ని మేం పొగుడుకోవడం కాదు. అలా పొగడ్తలతో ఆమె గొప్పదనాన్ని చాటింపు వేయాలంటే ఆమెని అవమాన పరచినట్టే అవుతుంది. ఆమె నిజజీవితంలో జరిగిన ఆసక్తికరమైన విషయాల సమాహారమిది. ఆ విషయాలు, విశేషాలు ఎవరికి ఎలా ఉపయోగపడుతాయో  , ఎంత మంది మనసులు నిండుతాయో చెప్పడం కష్టం. కానీ ఒకటి నిజం. ఆమెను తలచుకున్న వాళ్ళకి మనసులో ఎంత బాధ ఉన్నా మటుమాయమవుతుంది. 

          ఆమె అతి మామూలుగా బ్రతికిన మహోన్నత వ్యక్తి అని ఆమె ఉన్నపుడు తెలుసుకోక, ఉదాసీనంగా వుండి గొప్ప తప్పే చేశాము.

          జన్మనిచ్చిన తల్లి ఋణం ఎలా తీర్చుకోవాలో తెలియని ఆరాటం తోనూ, మానవాతీత విలువలతో నిరాడంబరంగా వుండి, తాను భరింపరాని కష్టాలు అనుభవించినా, ఇతరులకు ఆహ్లాదాన్ని ఇచ్చిన వ్యక్తిగా  నిలచిన ఆమె  ఆత్మకి   సంతోషం కలగాలనే కాంక్షతో  నిజాయితీగా  స్పందించి చేస్తున్న ప్రయత్నమిది. దీంతో నా ఋణం తీరేది కానేకాదు. కాని ఇప్పటికైనా ఈ ప్రయత్నం చేయకపోతే నైతికంగా నేరమే అవుతుంది.

          ఈ జన్మలో మా అమ్మ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావని ముందే అన్నాను కదా ! దానర్థం ఏమిటంటే, గత జన్మలో పరిష్కారం కాని, పరిహారం కాని విషయాలు ఆమెకున్నాయని ! అలాగైతే ఆ  కష్టాలేవో అనుభవించి కర్మ ఫలం తీరి కాలం చేసి వుండవచ్చును .  అలా కాకుండా, తాను మాత్రం కష్టాలు పడుతూ, చెరగని చిరునవ్వుతో అందరికీ శాంతిని  సంతోషాన్నీ ఇవ్వగలిగిన గుణం ఆమెది.  కాబట్టి గతజన్మలో చాలా పుణ్యం కూడా చేసి వుండాలి. ఆ పుణ్యం ఆమెకి కాకుండా,పిల్లలము మాకు ఉపయోగపడింది.  కొన్ని ఆత్మలు,  తమ పుణ్య ఫలం ద్వారా కేవలం ఇతరులకి మంచి చేసి తాము మాత్రం వ్యథలు అనుభవించి వెళ్ళిపోతాయని ఎక్కడో చదివాను.  ఆమె ఎంత గొప్ప ఆత్మ అన్నది ఇతరులపై ఆమె ప్రభావం ఎంతగా ఉండిందో తెలుసుకుంటే అర్థమవుతుంది.  . "  ఆ భగవంతుడు తన కు మారుగా ప్రతి ఇంటిలోనూ తన  అంశని ఇలా పంపుతాడు . సందేహం లేదు. .."  . ఇలా ఎవరైనా చెపితే ఎంత బావుణ్ణు ! .

 మీ చిరునవ్వుని నేను గమనింపకపోలేదు.

      ’" ఇవేవో మహా జ్ఞానులు, తాత్వికులు తేల్చాల్సిన విషయం . నాబోటి అజ్ఞాని కి అందని విషయం ’ " అనే కదా !  ముమ్మాటికీ! కానీ, నాబోటి అజ్ఞానికి కూడా ఒక విషయం స్పష్టం గా, ఖచ్చితం గా తెలుసు. ఆమె కేవలం మామూలు ఆత్మ ఐనట్టైతే, ఇంత కాలం తర్వాత, ఈ విషయాలు  ఎంతమాత్రం  బయటికి వచ్చేవి కావు.  ఈ బయటకు వచ్చిన విషయాలు ఎవరినైనా ఆకట్టుకున్టాయో లేదో  తెలీదు. ఆమె గొప్పదనం ఏమిటో ఠక్కున అడిగితే చెప్పడానికి ఏముంది అనిపిస్తుంది. ఏ విషయం గొప్పదో, ముఖ్యమైనదో తోచడం లేదు. కానీ ఆమెలో ఏదో ప్రత్యేకత వుంది. అది ఏమిటో ఈ పుస్తకం చదివి తెలుసుకుని,   మీలాంటి చదువరులు ఆమెను ఎలా అభివర్ణిస్తారో తెలుసుకోవాలనుంది.

          మా తండ్రి గారు భాస్కరభొట్ల  కేశవయ్య గారు, 1995, మే 22 న  ( వైశాఖ బహుళ అష్టమి )  కాలం చేసినారు. అంతకు పదేళ్ళముందు, 1985 డిసెంబరు 11 న ( కార్తీక అమావాశ్య ) మా తల్లి పరమపదించారు. మా తండ్రిగారికి శ్రాద్ధ కర్మలు చేస్తున్న సమయంలో వచ్చిన ఆలోచన ఇది. చూస్తుండగానే 15 ఏళ్ళు గడచిపోయాయి. ఎప్పటికైనా రాయగలనా అనేది నా అంతర్మధనం.

          ఎందుకు రాయలేకపోయాను అంటే రకరకాల కారణాలు వున్నా, అన్నింటికన్నా ముఖ్యమైనది, బలీయమైన సంకల్పము, నియమ నిష్టలు  పాటించడము వంటివి చాలా ముఖ్యమని ఆలశ్యంగా అర్థం కావడం. ఇంతటి మహత్తర విషయాలని  ఆషామాషీగా ఉంటూ రాయడం కుదరదనే సత్యాన్ని నాకు పరోక్షంగా తెలిపింది కూడా మా అమ్మే. 


 సమాచారం అంతా సేకరించి సర్వధారి సంవత్సరం విజయదశమి 19-10-2008 రోజున రాయడం మొదలుపెట్టాను .

          ఈ పుస్తకం రాసేముందు,  దీనికి స్పందన ఎలా వుంటుందో, అసలు రాయడం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా అని అనిపించింది. కాని, రెండేళ్ళకిందట నేను దీని విషయం కొందరు మిత్రుల తో చెప్పడం, అప్పుడప్పుడు దీనిని గూర్చి వారు ఆసక్తిగా అడగడం వలన  నా ఉత్సాహం పెరిగి, నన్ను రాసేంతవరకు నడిపించింది.

నా ఈ ప్రయత్నం నా తల్లి ఆశీర్వాదంతో విజయీకృతమౌతుందని నా నమ్మకం.

          అలాగే, రాస్తున్న విషయాలను నిర్మొహమాటంగా, నిష్పక్షపాతంగా చెబుతూ, ఆత్మస్తుతి, పరనిందలను దరికిరాకుండా చేసిన ప్రయత్నమిది.  ఈ పుస్తకం కేవలం మా కుటుంబీకులను, బంధువులను లక్ష్యంగా రాయలేదు. ఇది కొంతవరకూ నా వ్యక్తిగత కోణం నించీ రాసినా, ఇది సర్వులకు వివేచనా కారణం, మనోరంజకం, విజ్ఞానదాయకం కావాలనే ఉద్దేశంతో, విషయాన్ని రెండుగా విభజించి , మొదటి భాగంలో అమ్మ గురించిన సమాచారం నేరుగానూ , రెండో భాగం లో అందరికీ పనికి వచ్చే  , ’ మానసిక ఆరోగ్యము ’, ’ ధ్యానము ’ , ’ వంటలు ’,  ’ పాటలు ’ ,  ’ కలల విశ్లేషణ ’   , ’ వస్తు వాస్తు ’  వంటి మరిన్ని అనుబంధ అంశాలను జోడించడం జరిగింది. సహృదయులకు అభినందనలతో,

                           " సర్వేజనాః సుఖినో భవంతు  "